Tuesday 18 June 2013

జగన్‌ది తప్పు ఎలా అవుతుంది?: భూమన

హైదరాబాద్: మంత్రులకు ఓ న్యాయం, వైఎస్ జగన్‌కు మరో న్యాయమా అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. మంత్రులు ఏతప్పు చేయలేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని, మంత్రులది తప్పుకాకుంటే వైఎస్ జగన్‌ది తప్పు ఎలా అవుతుందన్నారు. క్విడ్‌ప్రోకో జరగనపుడు వైఎస్ జగన్‌ నేరస్తుడు, కుట్రదారుడు ఎలా అవుతారని అడిగారు. ఒక్క రోజు కూడా ప్రభుత్వభాగస్వామిగా లేని వైఎస్ జగన్ నేరస్తుడు ఎలా అవుతారని నిలదీశారు. 

చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల సంగతి టీడీపీ నేతలు మరచిపోయారా అని అన్నారు. టీడీపీ ఓ పక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరో పక్క కళంకిత మంత్రులంటూ నాటకాలాడుతోందని భూమన విమర్శించారు.