Monday 27 May 2013

జగన్ కోసం జనం... ఫోటో గ్యాల‌రీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేసి ఏడాది కాలం పూర్తయింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని జననేతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసించారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి ఆయన్ను అక్రమంగా జైలుకు పంపించాయని వైఎస్సార్సీపీ నేతలు పలువురు ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో జగన్‌ను ఏడాది పాటు జైల్లో నిర్బంధించడమే గాక నిబంధలనకు విరుద్ధంగా చార్జిషీట్లు వేస్తూ సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో సీబీఐ నడుచుకుంటూ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తుండ డాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు తగు విధంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 










పాలకొల్లులో నేడు YSషర్మిల నిరసన దీక్ష

పాలకొల్లు, న్యూస్‌లైన్ : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది దాటిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన సోదరి షర్మిల మంగళవారం పాలకొల్లులో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె పాలకొల్లులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. షర్మిలతోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దీక్ష విరమించడానికి ముందు ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడతారని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన నిలవడమే తప్పా?: YS భారతి

హైదరాబాద్: ప్రజల పక్షాన నిలబడినందుకే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. తమ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అరెస్టయిన వ్యక్తికి చట్టం ప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని, కానీ జగన్ ను అరెస్ట్ చేసి ఏడాది పూర్తయినా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టి రెండేళ్లవుతున్నా జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదని భారతి అన్నారు. విచారణ చేయకుండానే జగన్ ను మొదటి ముద్దాయిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ఒక ప్రశ్న అడగకుండానే మూడు చార్జిషీట్లు వేశారన్నారు. 

ప్రజలతో ఉండాలనుకోవడమే తాము చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. జైల్లో ఉన్న జగన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడివుంటానని చెప్పారన్నారు. 

నెక్లెస్‌రోడ్‌ చేరుకున్న YS జగన్ కుటుంబ సభ్యులు

హైదరాబాద్: వైఎస్‌ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. జగన్ కు మద్దతుగా భారీగా వచ్చిన జనంతో నెక్లెస్‌రోడ్‌ అభిమాన సంద్రంగా మారింది.

పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. వేదిక దగ్గరకు వచ్చిన జగన్ కుటుంబ సభ్యులను అభిమానులు చుట్టుముట్టారు. కాసేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 

చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిర్బంధాన్ని నిరసిస్తూ వారు ఈ ప్రదర్శన చేస్తున్నారు. జైజగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

మధుయాష్కి ఆరోపణల మతలబు

మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని పొగుడుతారో అర్దం కాని రాజకీయాలు ఏర్పడ్డాయి.గతంలో పొగిడిన, లేదా విమర్శించిన విషయాలను మర్చిపోతుంటారన్న సంగతి మధు యాష్కి వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.మధు యాష్కి తనను కెసిఆర్ గతంలో తెలంగాణ జాతి రత్నం అన్నారని, ఇప్పుడు తెలంగాణ బుడ్డర్ ఖాన్ అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.సీట్లు ,నోట్లు,ఓట్ల రాజకీయం చేస్తున్న కెసిఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తాను ల్యాంకోలో పెట్టుబడులు పెట్టలేదని,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని, న్యూజెర్సీలో స్ట్రిప్ మాల్ కొనలేదని, బతకమ్మ పేరుతో కోట్లు వసూలు చేయలేదని అన్నారు. శాసనసభ ఉప సభాపతి అయినప్పుడు కెసిఆర్ ఆస్తులెంత?ఇప్పుడు ఆస్తులు ఎంత విచారణకు సిద్దమా?అని మధుయాష్కి సవాలు చేశారు.కేవలం కాంగ్రెస్ ఎమ్.పిలను టిఆర్ఎస్ లోకి వెళ్లకుండా తాను అడ్డుపడుతున్నానని భాధతోనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.వంద సీట్లు వస్తేతెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మొత్తం మీద కెసిఆర్ కుటుంబానికి చెందినవారి పై ఆ పార్టీ నుంచి సస్పెండైన రఘునందనరావు తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తే, కాంగ్రెస్ ఎమ్.పి మధు కొత్త ఆరోపణలను గుప్పించి కెసిఆర్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించడం విశేషం