Monday 13 May 2013

కొండా దంపతులు రాజీకి వచ్చినట్లేనా!


వరంగల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్య నేతలు కొండా మురళీ,సురేఖ దంపతులు మంగళవారం నాడు జగన్ ను కలవబోతున్నారు. ముందుగా వారు విజయమ్మతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రేపు జగన్ తో ములాఖత్ లో కలవడానికి సిద్దమవుతున్నారు. గత కొద్ది రోజులుగా వీరు పార్టీని వదలుతారని, అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాంగ్రెస్,బిజెపి వంటి పార్టీలవైపు వెళుతున్నారని కూడా ప్రచారం జరిగింది.చివరికి గొడవలు సద్దుమణిగి వారు రాజీకి వచ్చారని అనుకోవాలి. లేకుంటే జగన్ ను కలవడానికి వారు వెళతారా?

0 comments:

Post a Comment