Wednesday 1 May 2013

ఆనం రామనారాయణరెడ్డి కు లీగల్ నోటీసు చేరింది: శివకుమార్

హైదరాబాద్: వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ జారీ చేసిన లీగల్ నోటీసు మంత్రికి చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ తెలిపారు. తనకు లీగల్ నోటీసు అందలేదని మంత్రి ఆనం మీడియాతో చెప్పడంపై శివకుమార్ స్పందిస్తూ.. మంత్రికి లీగల్ నోటీసులు అందినట్లు వచ్చిన అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రతులను పత్రికలకు విడుదల చేశారు.

చంద్రబాబు బాబువి పనికిరాని పాదయాత్రలు


- టీడీపీ నేత మణిగాంధీ విమర్శ.. వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడి

హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల తన పాలనా కాలంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదని, ప్రజలు ఆయనకు పట్టంగట్టే పరిస్థితి లేదని కర్నూలు జిల్లా కోడుమూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శిఖామణి తనయుడు, టీడీపీ నాయకుడు మణిగాంధీ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు.
గాంధీ వెంట పత్తికొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, నాయకుడు భూపాల్‌రెడ్డి ఉన్నారు. ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన గాంధీ విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోతలు, రెట్టింపు చార్జీలతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. వైఎస్సార్ సీపీని కాంగ్రెస్‌లో కలిపితే జగన్‌ను బయటకు తీసుకువస్తామన్న కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆ పార్టీ క్రమ శిక్షణ ఎటువంటిదో ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. 

వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?


* కిరణ్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్న
* వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?
* బాబు ఏ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చారో.. వైఎస్ అలాగే చేశారు
* సీబీఐ మాత్రం కొంతమందినే లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది
* బాబు పాలనలాగే.. కిరణ్ పాలనలోనూ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు
* పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే

హైదరాబాద్: ఒకప్పటి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు ఇస్తే అవి ‘క్విడ్ ప్రో కో’ కిందకు రావా? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు మాత్రమే ‘క్విడ్ ప్రో కో’ అవుతాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆమె అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏ మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారో.. వైఎస్ కూడా అదే పద్ధతిలో రాయితీలిచ్చారు. ఇప్పుడు కిరణ్ అదే విధానంలో ఇస్తున్నారు. కానీ సీబీఐ కొంత మందినే లక్ష్యంగా చేసుకుని వారిని వేధింపులకు గురిచేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుజుకు ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు?
‘ఇసుజు’ కార్ల కంపెనీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు అని విజయమ్మ నిలదీశారు. ‘‘సాధారణంగా 50 శాతం వరకూ వ్యాట్ రాయితీలు ఇవ్వవచ్చు. అలాంటిది 135 శాతం రాయితీలు ఎలా ఇచ్చారు? రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీకి రూ.2,025 కోట్ల రాయితీలు ఇస్తున్నారు. చంద్రబాబు, కిరణ్ ఏమిచ్చినా నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లా? వైఎస్ ఏమిచ్చినా ‘క్విడ్ ప్రో కో’ అవుతుందా?’’ అని విజయమ్మ ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో పేరిట సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ వేధిస్తూ.. ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలా పెట్టుబడులు పెట్టినవారిని వేధిస్తూ విద్యుత్ కూడా సరిగా ఇవ్వని నేపథ్యంలో ఏ పారిశ్రామికవేత్తయినా రాష్ట్రానికి ఎందుకు వస్తారు? ఎలా పెట్టుబడులు పెడతారు? అని ప్రశ్నించారు. ‘‘భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ముఖ్యమంత్రి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయన్నారు. కనీసం రూ. 65 కోట్ల విలువ చేసే పరిశ్రమ అయినా వచ్చిందా? 35 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు?’’ అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హాలిడే ప్రకటించి.. ప్రజలను గాలికొదిలేసి... కేవలం వైఎస్‌ను విమర్శించడానికి, వైఎస్ కుటుంబాన్ని వేధించడానికే సమయం వెచ్చిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు..
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏరోజూ కార్మికులను, పేదోళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఏం చేయమంటే అది చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి, ప్రభుత్వ ఉద్యోగాలను ఊడబీకేయడానికి కృషి చేశారు. రాష్ట్రంలో 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు.

విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వేల కోట్లు దోచిపెట్టారు. మొన్నటికి మొన్న చిల్లర వర్తక రంగంలో విదేశీ పెట్టుబడుల బిల్లుపై ఓటింగ్‌కు తన పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించి.. ఆ బిల్లు ఆమోదం పొందేలా చేశారు’’ అని దుయ్యబట్టారు. ఆర్టీసీ వంటి సంస్థలను ప్రైవేటీకరించాలని బాబు ప్రయత్నిస్తే ప్రతిపక్ష నేతగా అందరితో కలిసి వైఎస్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేపట్టిన వైఎస్ పాలనను జగన్ నేతృత్వంలో తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

ఘనంగా మేడే: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో భాగంగా విజయమ్మ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన సభలో కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మే డే ఉత్సవం అనంతరం విజయమ్మ సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్, టీడీపీల ఆశల్ని తలకిందులు చేస్తాడని!


జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణం... ‘జగన్ ఒక ఎంపీ. ఒక పార్టీ అధ్యక్షుడు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అని! ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే, సాక్ష్యాలు దొరికాక అరెస్ట్ చేస్తారు. కానీ సీబీఐ లాంటి సంస్థ ఏమంటోందంటే, ‘జగన్ తప్పు చేశాడని అనుమానం ఉంది. దానిని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నిరాటంకంగా సాగాలంటే ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి’ అని!! సీబీఐ చెప్తున్న కారణం ఎంత సిల్లీగా ఉందంటే, రేపు ఒక సామాన్యుణ్నీ ఇదే కారణంతో అరెస్ట్ చేసినా, ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాట, అరెస్ట్ అయ్యి పది నెలలు దాటినా ఇదే మాట.

ఇలా ఒక వ్యక్తిని జైల్లో ఉంచటం న్యాయమా?
భారతదేశంలో ఇది ఒక పెద్ద కుట్ర. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయటానికి కేసులు పెట్టడం, బెదిరించటం, మాట వినకపోతే అరెస్ట్ చేయటం, ఇంకా మాట వినకపోతే బెయిల్ రాకుండా చూడటం! అధికారంతో ఇన్ని పనులు చేయగలిగిన వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో ఉందంటే ఎంత ఘోరం. ఎన్ని తప్పులు చేసినా అధికారపక్షం మాట వింటే అరెస్టులు ఉండవు. బయటకొచ్చినా, దాని గురించి సీబీఐ విచారణ ఉండదు. అధికార పార్టీకి చెందిన ఎవరినీ సీబీఐ అరెస్ట్ చేయదు.

ఒక 2జీ స్కామ్, కోల్ స్కామ్... ఏదైనా ఇదే వరుస.ఎన్నో కేసులు చూశాం. అన్నింటిలో బలవంతునికి ఒక న్యాయం, బలహీనునికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తికి ఒక న్యాయం, లేని వ్యక్తికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తి ఇన్ని వ్యవస్థలను ప్రభావితం చేయగలిగితే, ఆ వ్యక్తి ఒకవేళ చెడ్డవాడైతే దేశానికి ఎంత నష్టమో గమనించాలి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు దీన్ని ప్రశ్నించాలి. ధైర్యంగా వ్యతిరేకించాలి. అధికారంలో ఉన్న వ్యక్తికి తన పరిధి ఏంటో చూపించాలి.

అదే పని చేస్తున్న వ్యక్తి వై.ఎస్.జగన్‌గారు. భయపెట్టినప్పుడు లొంగలేదు. అరెస్ట్ చేసినప్పుడు కుంగిపోయి వారి మాట వినలేదు. బెయిల్ రాకుండా ఉన్నా తొణకలేదు. ఇలాంటివారే నిజమైన నాయకుడు. వీరే ప్రజలకు మంచి చేయటం కోసం ధైర్యంగా ముందుకు సాగగలరు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా దేశాన్ని కాపాడగలరు.అధికారంలో ఉన్న వ్యక్తి తనకు అధికారాన్ని అందించిన ప్రజలను తప్ప అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా మార్చుకోగలడు. ప్రజల మన్ననలు పొందాలంటే మాత్రం, వారి కష్టాలను తీర్చాలి, ఆకాంక్షలను నెరవేర్చాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి. అది సాధ్యమయ్యేది ఒక్క వైఎస్సార్‌కి, తర్వాత జగన్‌కు మాత్రమే.

కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!ఒకసారి ఆలోచిద్దాం, జగన్ ఒకవేళ ఈ అరెస్టులకు భయపడి, ఇవన్నీ మనకెందుకు, కామ్‌గా మనపని మనం చేసుకుపోదాం అనుకొనుంటే, ఆయన ఎప్పుడో కేంద్రమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు.

కానీ ప్రజలకు మేలుచేసే ఒక్కొక్క పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తుంటే సహించలేకపోయాడు. బాగుపడిన పేదవాడి జీవితాన్ని ఛిద్రం చేసే కాంగ్రెస్ ఆలోచనలను సహించలేకపోయాడు. అందుకే ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఎదిరించాడు. పర్యవసానం... జైల్లో ఉన్నాడు. మనకోసం ఆయన జైలుకెళ్తే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? 

మనం నోరుతెరిచి, ‘మా సమస్యలను పరిష్కరించే నాయకుణ్ని జైల్లో ఉంచి మీరు పరిపాలించొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోండి. కేసులు పెట్టి కాదు. ఇక్కడ ప్రజలు తమకు మేలుచేసిన నాయకుడిని ఎప్పుడూ మరిచిపోరు’ అని చెబుదాం. 

కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!

చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు చైతన్యవంతులైనందు వల్లే బాబును రెండుసార్లు ప్రతిపక్షనేతగా ఉంచారని ఈ సందర్భంగా కొణతల రామకృష్ణ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ కు సీల్డ్ కవర్ లా పనిచేస్తోందని ప్రజలకు అర్థమైందని ఆయన వివరించారు.

సీబీఐని రద్దు చేయాలి: జూపూడి ప్రభాకర్‌రావు

హైదరాబాద్: రాజకీయబాసుల కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై అవినీతి ఆరోపణలు సంధించి వారిపై చర్యలు తీసుకొనేందుకు, ఇష్టానుసారంగా దర్యాప్తు చేయడానికి కేంద్రం సీబీఐని పావులా వాడుకుంటుందని ధ్వజమెత్తారు.

4,5 తేదిల్లో దేశవ్యాప్త ఆందోళన: బీజేపీ

న్యూఢిల్లీ: అవినీతి, కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 4, 5 తేదీల్లో దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అవినీతికి కాంగ్రెస్ కేంద్రంగా మారగా...పాపాలకు ప్రధాని సంరక్షకుడిగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఢిల్లీలో ఆరోపించారు. 

Puttedu Dhukam Pantina Dhachi.... YSR Song

Kiran Kumar Reddy became Chief Minister out of luck, he is a Dalit betrayer: Shankar Rao

Former minister P Shankar Rao on Wednesday claimed that Kiran became Chief Minister out of luck, though he did not do any service to the party. Breathing fire on CM Kiran Kumar Reddy, Shankar Rao termed the Chief Minister as a betrayer of Dalits and called him a Dalit Rabandhu. Shankar Rao said the state of Andhra Pradesh is virtually under ‘police rajyam’.
Shankar Rao said the entire Dalit community in the state dumped the Congress party because the Congress had been humiliating the Dalit leaders in the community. “I was expelled from the cabinet, and the deputy Chief Ministers Damodara Raja Narasimha is being humiliated. This is why all the Dalits are going away from the party” he said.

The former ministers also observed that minorities, Dalitis and women are dumping the Congress party purely because of CM Kiran’s attitude. “The Congress party lost the support of minority community due to police harassment on Owaisi brothers” Shankar Rao said.

త్వరలో రాజన్న రాజ్యం: YSషర్మిల


ఖమ్మం: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కరెంట్‌ బిల్లులు విపరీతంగా పెరిగాయని, రైతులకు రుణాలు అందడంలేదని, పంటనష్ట పరిహారం అందడంలేదని గిరిజన మహిళలు సూర్యతండాలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో పావలావడ్డీ రుణాలు సక్రమంగా అందేవని..ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మహిళలు షర్మిలతో అన్నారు. అయితే మహిళల బాధలకు స్పందించిన షర్మిల ..త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుంది అని భరోసా నింపారు. 
రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని షర్మిల అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా గిరిజనులకు 2లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కు కల్పించిన ఘనత వైఎస్‌దేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్‌ బతికివుంటే మరో 6లక్షల ఎకరాలు భూపంపిణి జరిగి వుండేదని షర్మిల అన్నారు. నాడు వైఎస్‌ ప్రతి కుటుంబానికి 30కేజీల బియ్యం ఇవ్వాలనుకున్నారని.. కానీ నేడు కిరణ్‌ సర్కార్‌ 20కేజీలకే పరిమితం చేసిందని షర్మిల విమర్శించారు. మహిళలకు మేలు చేసేందుకు జగనన్న అమ్మఒడి వంటి పథకాన్ని ప్రకటించారని షర్మిల తెలిపారు.

కేంద్రంపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం


న్యూఢిల్లీ: పౌరుత భద్రత విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. అలాగే చాలా మందికి భద్రత కల్పిస్తున్నారు. మరి సామాన్య పౌరుల 
సంగతేంటి? ఢిల్లీలో భద్రత బాగుంటే అయిదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైయ్యేది కాదుగదా? అని ప్రశ్నించింది.

కాంగ్రెస్ కు కోదండరామ్ హెచ్చరిక

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమైయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఐక్యత మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

ధైర్యంగా ఉండండి జగన్ వస్తారు: YSవిజయమ్మ


సికింద్రాబాద్: అడ్డగుట్ట రచ్చబండలో తమ బాధలు చెప్పుకున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు. జగన్ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం ఈ రచ్చబండ ఉద్దేశమని చెప్పారు. పథకాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికే పార్టీ ఈ రచ్చబండను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే వృద్ధులకు 700 రూపాయల పించన్ ఇస్తారన్నారు. కార్మికులందరికీ విజయమ్మ మేడ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ పేరులోనే శ్రామికులను చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం పాలనలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాక్టరీలు మూత పడటంతో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండేళ్లుగా కుంటుపడుతున్నాయని బాధపడ్డారు.
వైఎస్ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏ ప్రాతిపదికన ఈసీజీ కార్ల కంపెనీకి పెట్టుబడికి మించి రాయితీలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించినట్లు, లక్ష మందికిపైగా ఉపాధి కల్పించినట్లు కిరణ్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని, కనీసం ఒక్కరికైనా ప్రభుత్వరంగంలో ఉపాధి కల్పించారా? అని ఆమె ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచారని, ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూశారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు రాష్ట్రంలో రావాలసిన అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు 50 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ నేతలకు దారాదత్తం చేశారని చెప్పారు. దాంతో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు..