Tuesday 21 May 2013

మా మనసు ఎంత బాధపడి ఉంటుంది- YS షర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మంత్రులు ధర్మాన, సబితలు తమను కళంకిత మంత్రులు అంటుండడంపై బాధపడుతున్నారని, తమను అవినీతి మంత్రులు అని అనవద్దని కోరుతున్నారని, మరి జగన్ ను ఏ కోర్టు దోషి అని చెప్పిందని కొందరు కాంగ్రెస్ నేతలు అవినీతి కడుతున్నారని ప్రశ్నించారు. ఒక మంత్రి అయితే జగన్ ను ఉరివేయాలంటున్నాడని, అప్పుడు మా మనసుకు బాధ కలగదా అని షర్మిల వ్యాఖ్యానించారు.26 జీవోలు కేబినెట్ సమిష్టి నిర్ణయం అని ఈ రోజు చెప్పుకుంటున్నారని..నాడు జగన్ ను అరెస్ట్ చేసిన రోజునే ఈ మంత్రులెందుకు చెప్పలేదని ఆమె ప్రశ్నించారు. అప్పుడే 26 జీవోలు సక్రమమని చెప్పిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని షర్మిల అన్నారు. ఐఎంజీ కేసులో చంద్రబాబు ఒక్కరోజు విచారణకు హాజరైనా ఏనాడో జైలుకు వెళ్లేవారని.. కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు.

పులివెందులలో నేడు విజయమ్మ పర్యటన


పులివెందుల : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ బుధవారం పులివెందులలో పర్యటించనున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు. 

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లెలో తాగునీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 23న దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు.

తవ్వుకున్న గోతిలోనే పడ్డారు


* జగన్ కేసులో మంత్రుల తీరుపై నిప్పులు చెరిగిన షర్మిల
* 26 జీవోలపై కోర్టు నోటీసులిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సమాధానమివ్వలేదు
* జీవోలతో సంబంధం లేని జగనన్నను జైలుకు పంపుతుంటే వీరంతా వేడుక చూశారు
* ఈ రోజు వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడుతుంటే.. ఆ జీవోలన్నీ సక్రమమేనని ఒప్పుకొంటున్నారు
* నేరం నిరూపణ కాకుండా తమను అవినీతి మంత్రులని ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారు
* మరి ఏ కోర్టూ చెప్పకుండానే జగన్‌ను దోషి అంటే మాకు బాధ కలగదా?
* దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవినీతి గురించి చంద్రబాబు లెక్చర్ ఇస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అక్రమాలు జరిగాయని చెబుతున్న 26 జీవోల కేసులో కోర్టు మొదటిసారి నోటీసు ఇచ్చినప్పుడు జగనన్న 52వ ప్రతివాది. కాంగ్రెస్ మంత్రులు, అధికారులు 1 నుంచి 15వ నంబరు వరకు ప్రతివాదులుగా ఉన్నారు. అయినప్పటికీ నాడు కోర్టు నోటీసులకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ఈ రోజు మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. అసలు అవినీతే జరగలేదని, క్రిడ్ పో కో లేదని, అర్హులైన వారికే భూమినిచ్చామని మంత్రులు ఒప్పుకొనే పరిస్థితికి వచ్చారు. కోర్టు నోటీసులిచ్చినప్పుడే మంత్రులు ఈ సమాధానం చెప్పి ఉంటే.. ఈ కేసు నిలబడేదే కాదు. ఆ రోజు జగనన్నను ఎలాగైనా ఇరికించాలని అనుకున్నారు. అడ్డు తొలగించాలనుకున్నారు.

ఈ రోజు వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. గిలాగిలా కొట్టుకుంటున్నారు. వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతుంటే.. నిజాన్ని బయటపెడుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజల్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సాగింది. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనప్రవాహాన్ని ఉద్దేశించి షర్మిల ఉద్వేగంగాప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..


చంద్రబాబును మించిన అవినీతి పరుడు లేడు..
‘‘ఒకరోజు చంద్రబాబు అవినీతి గురించి ఎన్టీఆర్‌గారు మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే లేరని అన్నారు. అసలు సిసలు అవినీతిపరుడైన చంద్రబాబు.. నిస్సిగ్గుగా నిన్న ఢిల్లీకి వెళ్లి.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవినీతి గురించి లెక్చర్ ఇచ్చి వచ్చారట. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబుగారికి తన అవినీతి చరిత్ర గుర్తొచ్చినా.. ‘నాకేమిటి సిగ్గు’ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకవైపు తనపై విచారణలు, కేసులు జరక్కుండా చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నారు. ఇంకొకవైపు అవినీతిపై ధర్మపోరాటం అంటున్న బాబును ఏమనాలి?
ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరు చేరిస్తే చోద్యం చూశారు..

చంద్రబాబు తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇంకోలా ఉంది. రాజశేఖరరెడ్డి ద్వారా పదవులు పొంది అనుభవిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు చోద్యం చూశారు. వైఎస్ తనయుడిపై కేసులు పెట్టి జైలుకు పంపుతుంటే.. వేడుక చూశారు.. చప్పట్లు కొట్టారు. ఈ రోజు వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతుంటే.. ఆ జీవోలన్నీ సక్రమమేనని, వైఎస్ ఒత్తిడేమీ లేదని, జీవోలన్నీ కేబినెట్ సమష్టి నిర్ణయాలని ఈ రోజు ఒప్పుకొంటున్నారు.

మాకు బాధ కలగదా..
నిన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘మమ్మల్ని కళంకిత మంత్రులంటున్నారు. అవినీతి మంత్రులంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. నేరం నిరూపణ కాకుండానే అవినీతి మంత్రులు అనడం సబబు కాదు’ అని అన్నారు. మరి జగనన్న దోషి అని, జగనన్న నేరం చేశాడని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు. అయినప్పటికీ జగన్ దోషి అని, ఆయనకు పద్నాలుగేళ్ల శిక్షపడుతుందని ఈ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అనలేదా అని అడుగుతున్నా. ఇంకొక నీతి మాలిన మంత్రి అయితే వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని, జగన్‌ను ఉరి తీయాలని అన్నారు.. మరి మాకు బాధ కలగదా అని ప్రశ్నిస్తున్నా.

కాంగ్రెస్, టీడీపీల కుట్రే ఇది..
వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో జగనన్న ఏ ఒక్క రోజూ సచివాలయానికి వెళ్లలేదు. ఏ మంత్రికీ ఫోన్ చేసి ఫలానా పని చేసిపెట్టమని అడగలేదు. మరి అలాంటి వ్యక్తికి ఈ జీవోలతో ఏం సంబంధముందని కేసులు పెట్టి అరెస్టు చేశారు? కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఆ రోజు జగనన్నను అడ్డు తొలగించుకోవాలని కుట్రలు పన్ని, ఈ కేసులు పెట్టాయి. మూడేళ్లుగా ఈ రెండు పార్టీలూ నీచమైన కుమ్మక్కుకు పాల్పడుతున్నాయి. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ నీచ రాజకీయాలు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాడు రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ అమలు చేస్తారు.’’

11.8 కిలోమీటర్ల పాదయాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 155వ రోజు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెల్లమిల్లిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి నడచుకుంటూ షర్మిల పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం పట్టణం మీదుగా ముదునూరుపాడు చేరుకున్నారు. ముదునూరుపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 11.8 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైసూరారెడ్డి, జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకుడు తోట గోపి పాల్గొన్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
మంగళవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 155
కిలోమీటర్లు: 2,062.8

ఏ తీర్పులు ఎలా ఉన్నా...ప్రజాతీర్పులో గెలుపు YS జగన్‌దే

జగన్ కేసును పరిశీలించిన కొద్దీ మామూలు ప్రజానీకం కూడా న్యాయస్థానాలు, వాటి పనితీరును శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది! న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదా, సీబీఐ లాంటి సంస్థలను అవి పూర్తిగా నమ్ముతున్నాయా అనే అనుమానం కూడా వస్తోంది. నేర నిరూపణ అయ్యేవరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే అన్న న్యాయసూత్రాన్ని అంతా విస్మరించారా అనిపిస్తోంది. విస్మరించనట్లయితే సంవత్సరకాలంగా జగన్ జైల్లో ఉండేవారు కాదు. ఒకపక్క సీబీఐ పూర్తిగా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడిచే సంస్థ అయి తెలిసిన తర్వాత కూడా ప్రతిసారీ ఆ సంస్థ వాదనలతో ఏకీభవించి జగన్ రిమాండును పొడిగించడం ఏమాత్రం సబబు కాదు.

అధికారంలో ఉన్న మంత్రులు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు... అధికారం లేని వ్యక్తి, అధికార పార్టీకి చెందనివ్యక్తి ఎలా ప్రభావితం చేస్తాడు అని ఒక్కసారి కూడా న్యాయస్థానాలు సీబీఐని ప్రశ్నించలేదు. ఒకపక్క ఏమాత్రం ప్రజాదరణ లేని శంకర్రావు లాంటి వ్యక్తి - తేదీ కూడా లేకుండా వేసిన - అర్జీని కోర్టు స్వీకరిస్తుంది. వేరొక చంద్రబాబు అవినీతి గురించి వేల పేజీలకొద్ది సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచి,

విచారించమని కోరితే, తక్షణమే తిరస్కరిస్తుంది! అక్కడ జగన్‌కు వ్యతిరేకంగా వచ్చిన అర్జీని ఎందుకు స్వీకరించిందో నాలాంటి సామాన్య పౌరులకు ఈ ప్రజాస్వామ్య దేశంలో వివరించాల్సిన ఆవశ్యకత న్యాయస్థానాలకు ఎంతైనా ఉంది. అంతిమంగా వీటన్నింటినీ మించిన తీర్పు, ప్రజాతీర్పు, జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా రావాలని, వస్తుందని ఆకాక్షిస్తున్నాను.
- ఎస్.ఖాసిమ్ కాదిర్, హైదరాబాద్

తిరుగులేని జనాదరణతో నాయకునిగా YS జగన్ అంతకంతకూ ..


కాంగ్రెస్-టీడీపీ ఎన్ని కుమ్మక్కు కుట్రలకు దిగినా, జన నేతను ప్రజలకు దూరం చేయాలన్న వాటి లక్ష్యం మాత్రం అస్సలు నెరవేరలేదు. సరికదా, ఈ నిస్సిగ్గు ప్రయత్నాల ద్వారా రెండు పార్టీలూ విశ్వసనీయతను, జనాదరణను నానాటికీ కోల్పోతూ అధఃపాతాళానికి దిగజారుతుంటే... తిరుగులేని జనాదరణతో నాయకునిగా జగన్ అంతకంతకూ ఎదుగుతున్నారు. తాము వైఎస్ తనయుని వెన్నంటే ఉన్నామని ప్రతి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పు చెబుతూనే వస్తున్నారు. కనీసం జేబు వ్యవస్థల సాయంతో జగన్‌ను ప్రజలకు తాత్కాలికంగా దూరం చేయగలిగామన్న ఆనందం కూడా టీడీపీ, కాంగ్రెస్‌లకు మిగల్లేదు.

ఆయన తరఫున ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, ఇంకోవైపు సోదరి షర్మిల ప్రజల పక్షాన వారి ప్రతి సమస్యపైనా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిరసనలు, దీక్షలతో పాలకులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ, ప్రజా సమస్యల పట్ల వారి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే ఉన్నారు. విజయమ్మ దీక్షలకు, షర్మిల చేపట్టిన చరిత్రాత్మక ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న జనం.. వారి ప్రతి అడుగులోనూ జగన్‌ను చూసుకుంటున్నారు. తమ నేత తిరిగి తమ మధ్యకు వచ్చే సుదినం కోసం ఎదురు చూస్తున్నారు.

అధికార-ప్రధాన ప్రతిపక్షాలు ఒక్కటై... జేబు వ్యవస్థల సాయంతో జన నేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు దూరంగా ఉంచి ఏడాది కావస్తోంది. దీని పూర్వాపరాలపై ప్రత్యేక కార్యక్రమం ‘చేతిలో సైకిల్’ బుధవారం రాత్రి 8.20కి సాక్షి టీవీలో..

పార్టీలోనే ఉండి పోరాడుతా!


కరీంనగర్ ఎమ్.పి పొన్నం ప్రబాకర్ తాను కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుతానని ప్రకటించారు.ఇప్పటికీ
కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుదన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.హై కమాండ్ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.లేకుంటే కాంగ్రెస్ కు తెలంగాణలో తీవ్ర నష్టం వస్తుందని ఆయన హెచ్చరించారు.

ముగ్గురు ఎంపీలు ఇదే అంశంపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారని, అధిష్టానం సానుకూలంగా స్పందిస్తే వారు పార్టీలోనే కొనసాగుతారేమోనని పొన్నం అభిప్రాయపడ్డారు. తాను పార్టీలో ఉండే తెలంగాణ కోసం పోరాడతానని పొన్నం తెలిపారు.

కాంగ్రెస్ లో చంద్రబాబు హవా!


కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు హవా కొనసాగుతోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని ఆమె అన్నారు.చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్‌ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు.చంద్రబాబు డిమాండుకు తలొగ్గే ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ బలిపశువులను చేసిందని ఆమె ఆరోపించారు.ఇప్పుడు ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే మార్చేస్తుందని కూడా ఆమె అన్నారు.ధర్మాన ప్రసాదరావు, సబితల రాజీనామాలపై కాంగ్రెస్ ఇంత హడావుడి నిర్ణయం వెనుక మతలబు ఏమిటని ఆమె ప్రశ్నించారు.

టీఆర్ఎస్ లొల్లిపై సీబీ'ఐ'


అసత్యపు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరఘునందన్ రావు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. పదమూడేళ్ల నుండి ఉద్యమ జెండాలు మోసిన తనకు ఎన్నికల సమయంలో మొండి చేయి చూపించడాన్ని జీర్ణించుకోలేని రఘనందన్ రావు టీఆర్ఎస్ అగ్రనేతలపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. రఘునందన్ రావు ఆరోపణలపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆత్మసంరక్షణలో పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కారణం ఊహించని విధంగా వేటుపై రఘునందన్ రియాక్ట్ కావడమే. టీఆర్ఎస్ అగ్రనేతలు కొన్ని సంస్థల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ రఘునందన్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు ఆత్మసంరక్షణలో పడటంతో రఘనందన్ తన ఆరోపణలకు మరింత పదనుపెడుతున్నారు. 

ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి జెండా మోసిన తాను టిక్కెట్లు అడిగితే తప్పేమిటని నిలదీశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి డబ్బులు తీసుకొని ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తనకు టీఆర్ఎస్ నేతల నుంచి బెదిరింపులు వచ్చినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని.. తెలంగాణ పేరుతో తాను ఎవరి వద్ద నుండైనా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేస్తే.. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. గత కొద్దిరోజులుగా మీడియాలో కాలం గడిపిన రఘునందన్ తాజాగా సీబీఐ జేడి లక్ష్మినారాయణను కలువడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. 

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావుల వసూళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఇటీవల ఆ పార్టీనుంచి సస్పెండ్ అయిన రఘునందనరావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. అనంతరం రఘునందనరావు విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్ మరియు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి స్టైలిష్ హోం ఎండీ రంగారావుకు సంబంధించిన లావాదేవీలను.. వాళ్లిద్దరూ టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంతో జరిపిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం సీబీఐకి అందజేశానని రఘునందన్ వెల్లడించారు. 

కేసీఆర్, హరీష్‌రావుల మీద తన దగ్గర ఉన్న ప్రాధమిక సమాచారం మొత్తం సీబీఐ జేడి ముందుంచానని తెలిపారు. పార్టీకి సంబంధించి అక్రమ వసూళ్లకు సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఏ సమయంలో వసూళ్ల జరిగిన వివరాలను ఫిర్యాదులో వివరించినట్టు చెప్పారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రసాద్ వద్ద నుంచి పది కోట్ల రూపాయలు, రంగారావు నుంచి మరికొంత మొత్తం వసూలు చేసినట్టు సీబీఐకి ఇచ్చిన లేఖ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారిని మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని తన ఫిర్యాదులో పేర్కొనట్టు రఘునందరావు తెలిపారు. 

టీఆర్ఎస్ అగ్రనేతలకు, బహిషృత నేత రఘనందన్ రావుకు మధ్య రాజకీయ వివాదం సీబీఐ వద్దకు చేరడం ఈ వివాదంలో సరికొత్త ట్విస్ట్ గా మారింది. రాజకీయ ప్రయోజనాలకే దేశ అత్యున్నత విచారణ సంస్థ దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ లొల్లి సీబీఐ వద్దకు చేరడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని విమర్శలు రావడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకున్నట్టు కనిపిస్తోంది. అయితే అన్ని కేసుల్లానే విచారణ సాగదీస్తారా లేక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి పూర్తిస్థాయిలో సీబీఐని ఉపయోగించుకుంటారా అనే విషయం కొద్దిరోజుల్లో స్సష్టంకానుంది.

కేసీఆర్, హరీష్ వసూళ్లపై ఫిర్యాదు


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావుల వసూళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఇటీవల ఆ పార్టీనుంచి సస్పెండ్ అయిన రఘునందన్‌రావు సీబీఐకి ఫిర్యా దు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. అనంతరం రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి స్టైలిష్ హోం ఎండీ రంగారావుకు సబంధించిన లావాదేవీలను.. వారిద్దరూ టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంతో జరిపిన వ్యాపార వ్యవహారాలపై పూర్తి సమాచారం సీబీఐకి అందజేసినట్లు చెప్పారు. కేసీఆర్, హరీష్‌రావుల గురించి తన వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మొత్తం వారి ముందుంచినట్లు తెలిపారు.

పార్టీకి సంబంధించి అక్రమ వసూళ్లు ఎవరి దగ్గర నుంచి ఏ సమయంలో జరిగాయో ఫిర్యాదులో వివరించినట్టు చెప్పారు. ‘టీ న్యూస్, నమస్తే తెలంగాణ’ ఏర్పాటు సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ వద్ద నుంచి పది కోట్ల రూపాయలు, రంగారావు నుంచి మరి కొంత మొత్తం వసూలు చేసినట్టు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారిని మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని కోరినట్టు రఘునందన్ తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించి ఎంపీ విజయశాంతి స్పందనను విలేకరులు ప్రస్తావించగా, మాట్లాడేందుకు నిరాకరించారు.

రఘునందన్ సీఎం తొత్తు : టీఆర్‌ఎస్

హైదరాబాద్: రఘునందన్‌రావు సీఎం కిరణ్ తొత్తుగా మారారని టీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఇతర నేతలపై ఆయన చేసిన విమర్శల్లో ఒక్కదానికి కూడా ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే తనకు గన్‌మెన్లను కేటాయించాలని స్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు స్పందనలేదని.. కానీ, కోరిన రెండు గంటల్లోనే రఘునందన్‌కు డీజీపీ గన్‌మెన్‌ను కేటాయించారని తెలిపారు. కిరణ్ కనుసన్నలలోనే ఆయన పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా అని శ్రవణ్ ప్రశ్నించారు. 

చంద్రబాబు పై YS విజయమ్మ ధ్వజం


టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. ఎన్.టి.ఆర్.పేరు చెప్పుకునే ఆయన బతుకుతున్నాడని , తెహల్క డాట్ కామ్ రెండువేల సంవత్సరంలోనే చంద్రబాబును అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని , అవినీతిపరుడని పేర్కొందని ఆమె అన్నారు గత మూడేళ్లుగా అన్ని ఎన్నికలలో టిడిపి ఓటమి చెందిందని,అనేకచోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.జగన్ పై కాంగ్రెస్ నేతలు, మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉరి తీయాలని కూడా అంటున్నారని, దేవుడు వీటిని గమనిస్తున్నారని, త్వరలో జగన్ బయటకు వస్తారని, ప్రజల పక్షాన పనిచేస్తారని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు ను జగన్ పూర్తి చేస్తారని ఆమె ప్రకటించారు.
కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

మిగిలిన మంత్రులకు ఎసరు పెట్టిన బొత్స సత్యనారాయణ


పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయవలసిందేనని ఆయన ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు మంత్రుల తప్పు లేదని చెబుతూ వచ్చిన బొత్స ప్రకటన ఉద్దేశం అదిష్టానం నిర్ణయానుసారం మాట్లాడడమా?లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెట్టడమా?అన్నది చూడాల్సి ఉంది.అంతేకాక పార్టీని వదలి వెళుతున్న ఎమ్.పిలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టుకుని వేలాడుతామా అని కూడా ఆయన అన్నారు.తెలంగాణ అంశం కేంద్రం పరిదిలో ఉందంటూ , ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని బలోపేతం చేయడానికి సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు.పత్రికలు ఎవరి ఎజెండా ప్రకారం రాస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.మంత్రులకు సంబందించి బొత్స చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,కన్నా లక్ష్మీనారాయణ,గీతారెడ్డిలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

రఘునందన్ సంచలన ఆరోపణ

టిఆర్ఎస్ నుంచి సస్పెండైన నేత రఘునందనరావు మరో సంచలన ఆరోపణ చేశారు.జగన్ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి టిఆర్ఎస్ నేతలు పది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.దీనికి సంబందించిన ఆదారాలు సిబిఐకి ఇచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పడం విశేషం.అలాగే ఎమ్.ఆర్.కేసులో ఉన్న కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావులతో కెసిఆర్,హరీష్ రావు లావాదేవీలు నడిపారని ఆయన ఆరోపించారు.

'ప్రాణహిత'కు జాతీయహోదా: YS విజయమ్మ డిమాండ్


సిర్పూర్-కాగజ్ నగర్(ఆదిలాబాద్ జిల్లా): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జగన్ సీఎం కాగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. 

ఈ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు జరిగిన న్యాయం ఏమీలేదన్నారు. 

అమ్మహస్తం మాయా హస్తంగా మారిందని విమర్శించారు. రాజీవ్ యువకిరణాల వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో ెప్పాలన్నారు. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎక్కడ, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి తరపున కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలనిపిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

బాబుకు తలొగ్గిన ప్రభుత్వం: శోభానాగిరెడ్డి


హైదరాబాద్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్‌ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు. 

ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే.. మార్చే స్థితిలో కాంగ్రెస్‌ ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గి ఇద్దరు మంత్రులను బలిపశువులను చేశారని అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. 

సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా!


తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండైన రఘునందనరావు చెప్పినట్లుగానే చేశారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ వసూళ్లపై చర్య తీసుకోవాలని కోరుతూ రఘునందనరావు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా కేసీఆర్, హరీష్‌రావులపై సీఆయన తన ఫిర్యాదును ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని ఆయన తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు కెసిఆర్, హరీష్ లపై ఫిర్యాదు సిబిఐకి ఫిర్యాదు చేయడం విశేషం.అయితే ఈ ఫిర్యాదును నేరుగా సిబిఐ చేపట్టే అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం. న్యాయవాది అయిన రఘునందనరావు ఏ చట్టం ప్రకారం ఈ ఫిర్యాదు చేశారో తెలియవలసి ఉంది. సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా?

యుపిఎకి గడ్డుకాలమే-సర్వే ఫలితాలు

కేంద్రంలో యుపిఎ భవిష్యత్తు కొంత గందరగోళంగానే ఉన్నట్లుంది.పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక టీవీ ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకి కేవలం 136 సీట్లే వచ్చే అవకాశం కనబడుతోంది. అదే బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. సీట్ల సంఖ్య 206 సీట్లకు పెరగవచ్చు.దేశవ్యాప్తంగా నూట ఏభై రెండు సీట్లలో చేసిన సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కు పూర్తి నిరాశగా ఉన్నాయని చెప్పాలి.అయితే బిజెపి కి పూర్తి స్థాయి అదికారం వచ్చే అవకాశం కనడడం లేదు. అంటే టిడిపి,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్,బిజెడి వంటి పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పార్టీలలో ఎక్కువ సీట్లు తెచ్చుకునే పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది.

నాడు వై.ఎస్.ఆర్., నేడు విజయమ్మ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగు ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేసి పూర్తి కాని ప్రాజెక్టు శిలాఫలకాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటి నిరసన కార్యక్రమాలు చేసి వచ్చారు.ఇప్పుడు ఆయన సతీమణి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నవై.ఎస్.విజయమ్మ కూడా ఇప్పుడు అదే పనిలో పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ వెళ్లిన విజయమ్మ గతంలో వై.ఎస్.శంకుస్థాపన చేసిన ప్రాణహిత ప్రాజెక్టు శిలాఫలకం వద్ద ఒక మొక్క నాటారు.అలాగే బోటులో ప్రాణహిత నదిలో కొంతదూరం వెళ్లి ప్రాజెక్టు ప్రదేశాన్ని చూసి వచ్చారు.మిగిలిన ప్రాజెక్టు స్థలాలను కూడా ఆమె సందర్శిచబోతున్నారు.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న విజయమ్మ రచ్చబండ, ప్రాజెక్టుల సందర్శన వంటి ఆందోళనలను నిర్వహిస్తున్నారు.

'కేసీఆర్, హరీష్ పై సీబీఐకి ఫిర్యాదు'


హైదరాబాద్: కేసీఆర్, హరీష్‌రావుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ నుంచి బహిష్కృతుడయిన రఘునందన్ రావు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని చెప్పారు. టీఆర్ఎస్ కు సంబంధించిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్ రావుపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జగన్ వస్తే సమస్యల పరిష్కారం: YS విజయమ్మ


ఆదిలాబాద్: జగన్ బాబు వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. తుమ్మడి వద్ద భూమి పూజకు వైఎస్ వేసిన పైలాన్ కు ఆమె పాలాభిషేకం చేశారు. ఆ తరువాత అక్కడ మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల నిర్మిద్దాం తెలంగాణను సశ్యశ్యామలం చేద్దాం అని పిలుపు ఇచ్చారు. 

ప్రాణహిత- చేవెళ్లకు నాడు వైఎస్ ఊపిరిపోస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాడెకడుతోందన్నారు. తెలంగాణ గుక్కెడు నీటిని కిరణ్ సర్కారు లాగేసి గొంతును నులిపేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య ఉందని వైఎస్ చెప్పారన్నారు. తెలంగాణ ముక్కోటి రత్నాల వీణ అని వైఎస్ చెప్పినట్లు తెలిపారు. ఆయన బతికి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షా 56 వేల 800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. 

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు సందర్శనకు విజయమ్మ హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన ఆమె ఉదయం 11.15 గంటలకు కాగజ్‌నగర్ చేరుకున్నారు. కాగజ్ నగర్ నుంచి విజయమ్మ రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చేరుకున్నారు. విజయమ్మ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ, ఇంద్రకరణ్ రెడ్డి, బొడ జనార్దన్, కోనేరు కోనప్ప, జనక్ ప్రసాద్ ఉన్నారు.