Tuesday 30 April 2013

సీబీఐ ‘రాజకీయ బందీ’ : సుప్రీంకోర్టు


కీయ జోక్యంతో సంస్థ నిష్పాక్షికతకు తూట్లు
ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలి
అదే తమ తొలి కర్తవ్యమన్న ధర్మాసనం
బొగ్గు కుంభకోణం దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి
నివేదికను కేంద్రంతో పంచుకుంటారా?
సీబీఐ తీరు మా అంతరాత్మనే కుదిపేసింది
మా నమ్మకాన్ని వమ్ము చేశారు
సీబీఐని తలంటిన ధర్మాసనం
మే 6లోగా అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
తదుపరి విచారణ మే 8కి వాయిదా

‘‘రాజకీయ బాసుల నియంత్రణ నుంచి సీబీఐ నేటికీ బయటపడకపోవడం చాలా తీవ్రమైన అంశం’’
‘‘మీపై (సీబీఐ) మేం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. బొగ్గు కుంభకోణం నివేదికను మీరు కేంద్రం ముందు పరిచిన తీరుతో దర్యాప్తు పునాదులే భారీ కుదుపునకు లోనయ్యాయి.
ఈ ఉదంతం మా అంతరాత్మనే కుదిపేసింది’’
‘‘రాజకీయ ప్రభావాలు, జోక్యాలు, చొరబాట్లు, ఒత్తిళ్లు తదితరాల బారి నుంచి సీబీఐని విముక్తం చేయడమే మా తొలి లక్ష్యం. దర్యాప్తు సంస్థ నిష్పాక్షికతను పునరుద్ధరించాలంటే ముందుగా మేం చేయాల్సిందదే’’
‘‘మీకు రాజకీయ ఊతకర్రల అవసరం లేదు. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండండి.’’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. సీబీఐని జేబు సంస్థగా మార్చేసుకుని, అడుగడుగునా దాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు తీరును తీవ్రంగా అభిశంసించింది. సునిశిత వ్యాఖ్యలు, ఆక్షేపణలతో దర్యాప్తు సంస్థకు, తద్వారా కేంద్రానికి అక్షరాలా పలుగు రాళ్లతో నలుగు పెట్టింది! బొగ్గు కుంభకోణంపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో కేంద్రం అనుచిత జోక్యం చేసుకుంటోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థాయీ నివేదిక ముసాయిదాను సీబీఐ తమకు సమర్పించే ముందే కేంద్రం ముందు పరిచిన తీరుతో మొత్తం దర్యాప్తు ప్రక్రియ తాలూకు పునాదులే భారీ కుదుపుకు లోనయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘అత్యంత ఆందోళనకరమైన, తీవ్రమైన అంశమిది. ఈ ఉదంతం మా అంతరాత్మనే కుదిపేసింది. ఇలాంటి పరిస్థితిలో మేమేం చేయాలి?’’ అని వ్యాఖ్యానించడం ద్వారా పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. ‘‘అత్యంత తీవ్రమైన అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన ఇలాంటి కేసులో నివేదికను ఇతరులతో ఎలా పంచుకుంటారు? మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించరా? దర్యాప్తును ఎలాంటి ప్రభావాలూ, జోక్యాలు, ఒత్తిళ్లకూ లోనవకుండా కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని మేం సుస్పష్టంగా ఆదేశించాక కూడా ఇలా జరిగిందంటే.. పటిష్ట పునాది కాస్తా భారీ కుదుపునకు లోనవుతోందన్నట్టే. మిమ్మల్ని మేం విశ్వసించాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని పూర్తిగా చీకట్లో ఉంచారు. మీ చర్య మీపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టేలా ఉంది’’ అని సీబీఐని కడిగి పారేసింది. అంతేకాదు... సీబీఐని రాజకీయ బాసుల కబంధ హస్తాల బారి నుంచి విముక్తం చేసి తీరతామంటూ ప్రతినబూనింది. సీబీఐని స్వతంత్ర సంస్థగా మార్చాలన్న వినీత్ నారాయణ్ తీర్పు వెలువడి 15 ఏళ్లయినా ఇప్పటికీ రాజకీయ ప్రభావం దాని నిష్పాక్షికతను దెబ్బ తీస్తూనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ, కార్యనిర్వాహక బాసుల నియంత్రణ నుంచి సీబీఐ నేటికీ బయట పడకపోవడం చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘‘స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండండి. 

ముచ్చర్లలో జెండా ఆవిష్కరించిన YSషర్మిల

ఖమ్మం : మహానేత వైఎస్సార్ తనయ షర్మిల ఖమ్మం జిల్లాలో బుధవారం పాదయాత్రను పునప్రారంభించారు. ముచ్చర్ల నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. మేడే సందర్భంగా షర్మిల ముచ్చర్లలో జెండాను ఆవిష్కరించారు. 135వ రోజు మరో ప్రజాప్రస్థానం యాత్ర అడవిమద్దలపల్లి, లాలయ్య తండా, మర్సగుంట, శ్రీరామపురం తండా, తిమ్మారావుపేట, రాజలింగాల గ్రామాల్లో కొనసాగనుంది.

విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 

వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ లో మేడే వేడుకలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఉదయం జాతీయ, వైఎస్ఆర్ టీయూసీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు కార్మికులు భారీగా పాల్గొన్నారు. 

Peddayana Peddayana.... YSR Song

పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గింపు ఈ అర్థరాత్రి నుంచే అమలు

న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటర్‌కు మూడు రూపాయలు తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో తాజా ధర 69 రూపాయలుగా ఉండే అవకాశముంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప ధరగా నమోదైంది. మార్చి 2 తేదితో పోలిస్తే పెట్రోలుధర లీటరకు ఎనిమిది రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో మార్చి 2 తేదిన లీటరు పెట్రోలు ధర 77.12 రూపాయలుగా ఉంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే పెట్రోల్ ధరను తగ్గించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తగ్గిన ధర ప్రకారం ఢిల్లీలో 66.09, కోల్ కతా 73.48, ముంబై 72.88, చెన్నైలో 69.08 గా ఉంటుంది. 

రేపట్నుంచి YSషర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

ముచ్చెర్ల: ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. మేడే సందర్భంగా రేపు ఉదయం 8:30 గంటలకు ముచ్చర్లలో షర్మిల జెండాను ఆవిష్కరిస్తారని రఘురాం తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. 

సీబీఐ పై రాజకీయాలా? సుప్రీం ఆగ్రహం

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ పై రాజకీయ జోక్యం ఉండరాదని, అలా ఐతే సీబీఐ పై ప్రజలలో గౌరవం తగ్గుతుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిన నివేదికను ప్రభుత్వానికి సీబీఐ ఇవ్వడం పై కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల కేసు బలహీనపడుతుందని చెప్పింది. దర్యాప్తు సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని తేల్చి చెప్పింది.  సీబీఐకి స్వయం ప్రతిపత్తి పునరుద్దరణకు కృషి చేస్తామని కోర్టు వ్యాఖ్యానించడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్శిస్థున్నరు. కాగా సీబీఐ తీరుతెన్నులపై, స్వతంత్ర ప్రతిపత్తిపై పలువురూ పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, సీబీఐని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న దన్న వైఎస్ఆర్  కాంగ్రెస్ ఆరోపణలకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలపరిచాయీ. జగన్ కేసులో నిందితుడుగా ఉన్న విజయసాయీ రెడ్డి ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి సుప్రీమ్ కోర్టు లో పిటిషన్ వేసి ఉన్నారు. 

సికింద్రాబాద్ లో రేపు వైఎస్ విజయమ్మ రచ్చబండ

సికింద్రాబాద్: ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రేపు సికింద్రాబాద్ లో రచ్చబండ నిర్వహించనున్నారు. అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. మురికివాడల్లోని ప్రజలతో ఆమె సమావేశమవుతారు. 

చంద్రబాబును జనం నమ్మరు: బొత్స సత్యనారాయణ


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు యాత్ర... 'వస్తున్న నాకోసం' అంటూ సాగిందని ఎద్దేవా చేశారు. బొత్స మంగళవారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెల్టు షాపులపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేదాన్ని విధిస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేశారని, ఇప్పుడు బెల్ట్‌ షాపులను ఎత్తివేస్తామంటున్న బాబును జనం నమ్మరన్నారు. వడ్డీలేని రుణాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారని, పథకాల పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు.

ప్రబుత్వ పథకాల అమలులో అలసత్వం ఉన్నమాట వాస్తవమేనని బొత్స అంగీకరించారు. ఇంకా కొన్ని హామీలను కాంగ్రెస్ నెరవేర్చాల్సి ఉందన్నారు. జగన్ బెయిల్ అంశంపై కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. వైఎస్‌ఆర్ హయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు న్యాయస్థానంలో రుజువైతే కాంగ్రెస్‌ కూడా తలదించుకోవల్సిందేనని బొత్స వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌


న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజ్వర్ లో ఉంచింది. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్‌పై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. వాన్‌ పిక్‌కు 18 వేల ఎకరాలు అభివృద్ధికోసం కేటాయించారని, గతంలో చంద్రబాబుకూడా ఇలాంటి భూకేటాయింపులు జరిపారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. 

పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని, దీనికి క్విడ్‌ ప్రోకో అంటగడుతున్నారని హరీష్‌ సాల్వే వాదించారు. సీబీఐ అభియోగాల్లో పసలేదని, బాబు చేసిన కేటాయింపులపై నోరుమెదపట్లేదన్నారు. మరో వైపు కేసు వివరాలను కోర్టుకు తెలిపిన సిబిఐ, ఈ కేసులో తుది ఛార్జిషీటు దాఖలు చేయటాకిని 4 నుంచి 6 నెలల సమయం కావాలని తెలిపింది. విచారణ పూర్తి అయ్యాకే తుది ఛార్జ్ షీట్ వేస్తామని స్పష్టం చేసింది. కాగా ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం చేశారు?


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు శుష్క, మస్కా వాగ్దానాలిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆ హామీలేవీ నెరవేర్చేవి కావన్నారు. గట్టు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1984 నుంచీ బాబు టీడీపీలో కీలక వ్యక్తి అని, 1995లో మామ నుంచి అధికారాన్ని లాక్కుని ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అప్పటినుంచి తొమ్మిదేళ్లు అధికారం చలాయించిన బాబు అసలు ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారు? వాటిలో ఎన్ని అమలు చేశారనేది తన పాదయాత్ర సందర్బంగా చెప్పి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌నే కాదు, ప్రజలను కూడా తన పాలనలో వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ‘‘1994 ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు రెండు రూపాయల కిలోబియ్యం ఇస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బాబు అధికారం చేజిక్కించుకున్నారు. రెండు రూపాయల కిలోబియ్యం, మద్య నిషేధం వల్ల ఖజానాపై తీవ్ర భారం పడుతోందని చెప్పి 1996 జూన్ 26న (ఎమర్జెన్సీ విధించిన తేదీన) ఒకే రోజు రూ.2,000 కోట్ల మేరకు పన్నులు వడ్డించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బియ్యం ధరను రూ. 3.25కు పెంచడంతో పాటుగా మద్య నిషేధాన్ని ఎత్తి వేసి రూ.1,200 కోట్ల రాబడి పెంచుకున్నారు’’ అని దుయ్యబట్టారు. 

వ్యవసాయరంగం దుస్థితిని గమనించి ఎన్టీఆర్ ఒక హెచ్‌పీకి రూ.50 విద్యుత్ టారిఫ్‌ను వసూలు చేస్తే దానిని రూ.600కు పెంచిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, ఉచిత బస్సుపాసులని 1999 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి, గెలిచాక వాటన్నింటినీ తుంగలో తొక్కారని గుర్తుచేశారు. ముందడుగు వెనక్కి పోయిందని, చేయూత, రోష్ని పథకాలన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఇంటికో వరం అని చెప్పి ప్రతి ఇంటిపైనా పన్ను భారం మోపారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో వృద్ధాప్య పింఛన్లను పట్టించుకోని బాబు ఇప్పుడు దారిలో ఒక ముసలమ్మను చూసి చలించి పోయాననడం హాస్యాస్పదమన్నారు. ఉద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెబుతున్న బాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో 60 శాతం మంది ఉద్యోగులు అవినీతిపరులేనని రాసుకున్న విషయం మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్‌పై మంద కృష్ణ మాదిగ చేసిన విమర్శలను ప్రస్తావించగా... తన హయాంలో 18 లక్షల మంది వృద్ధులకు రూ. 75 పింఛన్ ఇచ్చిన బాబును పక్కన కూర్చోబెట్టుకుని, 71 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చిన వైఎస్ ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని గట్టు వ్యాఖ్యానించారు.

Monday 29 April 2013

సీబీఐ చెప్పిందా.. అధిష్టానం చెప్పిందా?


జగన్ కేసులో కోట్ల వ్యాఖ్యలపై ఎంపీ సబ్బం హరి మండిపాటు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి వదలబోమని సీబీఐ చెప్పిందా... లేక వదలొద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందా అని ఎంపీ సబ్బంహరి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థగా వ్యవహరించాల్సిన సీబీఐ కాంగ్రెస్ చెప్పుచేతల్లో ఉందని చెప్పడానికి కోట్ల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. జగన్ విషయంలో ప్రజలు ఏదైతే అనుమానిస్తున్నారో సూర్యప్రకాష్‌రెడ్డి మాటల ద్వారా అదే వ్యక్తమయిందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రపై ఆయన స్పందిస్తూ.. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు నాడు వైఎస్సార్ సూర్యోదయం నుంచి మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను పొద్దుపోయేవరకూ సాగించి ప్రజల విశ్వాసాన్ని పొందారని గుర్తుచేశారు. నేడు చంద్రబాబు పాదయాత్ర ఎలా చేశారో జనం చూశారన్నారు. 2014 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోడానికే బాబు శుష్క వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ ఫలాలను అందుకోడానికి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతో జనం ఉన్నారన్నారు.

విచారణకు రాకముందే వాయిదా ఎలా: సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ తన ధోరణి మాత్రం మార్చలేదు. నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లు ఇవ్వాళ కోర్టు ముందుకు రానున్నాయి. కోర్టు ఇచ్చిన నెంబరింగ్‌ ప్రకారం ఏడో సీరియల్‌ నెంబర్‌లో ఈ రెండు పిటీషన్లు విచారణకు రానున్నాయి. అయితే ఈలోగానే సిబిఐ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు మెన్షనింగ్‌ మ్యాటర్‌ ఉంచారు.
అత్యవసర సమయంలో చేయాల్సిన వాదనను మెన్షనింగ్‌ మ్యాటర్‌ అంటారు. నిమ్మగడ్డ, విజయసాయిలకు సంబంధించిన పిటిషన్లను మే 7కు వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బొగ్గు కుంభకోణంకు సంబంధించిన వ్యవహారంలో తలమునకలయి ఉన్నామని, పని ఒత్తిడి వల్ల ఈ కేసును మే 7కు వాయిదా వేయాలని సిబిఐ కోరింది. విచారణకు రాకముందే కేసును ఎలా వాయిదా వేయమంటారని ప్రశ్నించిన కోర్టు పిటిషన్‌ బెంచ్‌పైకి వచ్చినప్పుడు పరిశీలిస్తామని తెలిపింది.

సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన టీ జాక్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సోనియాకు వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రం అనుమతించారు. పోలీసుల అనుమతితో టీ జాక్ నేత శ్రీనివాస్ గౌడ్ వినతపత్రం సమర్పించి వెనుదిరిగారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

సోనియాగాంధీ నివాసం వద్ద భద్రత పెంపు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం వద్ద మంగళవారం భద్రతను పెంచారు. దీంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణవాదులు సోనియా నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో... ముందస్తుగా భద్రతను పెంచారు. 

తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: అద్వానీ

హైదరాబాద్: ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లమని.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డు పడకుంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలతో సుమారు గంట సేపు మాట్లాడారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో సంసద్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ సంకల్పం కావాలని అద్వానీ వారితో పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ, విదర్భ రాష్ట్రాలు ఏర్పాటు కావాల్సిందని... తెలంగాణకు చంద్రబాబు, విదర్భకు శివసేన అడ్డు పడ్డాయని వివరించారు. ములాయం, లాలూ లాంటి వాళ్లు నిరాకరించినా, మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే గెలుస్తుందని, తప్పనిసరిగా తెలంగాణ ఇస్తుందని అద్వానీ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఈసారి తమ ఎన్నికల ఎజెండాలో పెట్టనున్నట్లు చెప్పారు. అయితే.. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అద్వానీ చెప్పినట్టు పార్టీ నాయకులు రామచంద్రరావు, మల్లారెడ్డి తెలిపారు. 

Abhimanyuda...! Arjunuda...! YS Jagan Song


YS Jagan's bail plea hearing adjourned to May 6

మే 1 నుంచి యధావిధిగా షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మే 1వ తేదీ నుంచి యధావిధిగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాదయాత్రికురాలు, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఎడమకాలి మడమ నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా మంగళవారం మరో ప్రజాప్రస్థానానికి విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిలకు మంగళవారం కూడా విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తల‌శిల రఘురాం చెప్పారు.

చంద్రబాబువి శుష్క వాగ్దానాలు: గట్టు రామచంద్రరావు


హైదరాబాద్ : శుష్క వాగ్దానాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ కోసం వస్తున్న పాదయాత్రలో బాబు చాలానే శుష్క వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని గట్టు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాల కోసం పోరాడారన్నారు.

ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు అలవాటేనని, మరోసారి ప్రజలను మోసం చేయడానికే ఈ వాగ్దానాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉండగా బాబు కోటి వరాలు అంటూ కోటి మోసాలు చేసింది నిజంకాదా అని ప్రశ్నలు సంధించారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయాల బియ్యం ధరను పెంచారని, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది కూడా ఆయనేనని అన్నారు. బాబు వాగ్దానాలను ఏ ఒక్కరూ నమ్మరని గట్టు పేర్కొన్నారు.

YS జగన్‌ బెయిల్‌పై సిబిఐకి సుప్రీం నోటీసులు


న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మే 6 లోపు నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంటోందని జగన్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే ... జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. 

సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని హరీష్‌ సాల్వే అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అక్టోబర్‌ 5 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని న్యాయమూర్తులకు వివరించారు. ఆ ఉత్తర్వు కాపీని న్యాయమూర్తులు పరిశీలించారు. హరీష్‌ సాల్వే వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 6న జరగనుంది. 

Sunday 28 April 2013

గులాబీ గూటికి కడియం శ్రీహరి!

సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోని నేతల వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాదయాత్రతో పార్టీకి ఊపు వచ్చిందని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇటీవలే గులాబీ చేరిన సంగతి తెలిసిందే. మరో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ కూడా టీఆర్ఎస్ బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే గులాబీ గూటికి చేరగా... వేణుగోపాలచారి, జోగురామన్న, నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.

కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖరారైంది. టీఆర్ఎస్ లో 'సీటు' ఖాయమడంతో టీడీపీని వదిలివెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనయుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం(ఏప్రిల్ 26) శ్రీహరి నివాసానికి వెళ్లి సుమారు రెండున్నర గంటల పాటు 'ఒప్పందం'పై మంతనాలు సాగించారు. కేసీఆర్ కూడా ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తామని కడియంకు కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కారు ఎక్కాలని కడియం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. మే నెల మొదటివారంలో ఆయన కేసీఆర్ పార్టీలోకి వెళ్లనున్నారు.

ముందుగా వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని గులాబీ దళం అధినేత ఆఫర్ చేయడంతో వలస నేతలు తొందర పడుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరితే ఆయనను కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, పెద్దపల్లి ఎంపీ వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్టున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే వీరు కారెక్కే అవకాశ ముందంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర టీడీపీ నేతలను, అధిష్టానం బుజ్జగింపులు కాంగ్రెస్ నేతలను గడప దాటకుండా ఆపలేకపోతున్నాయి. ఇంకెంత మంది నేతలు గులాబీ గూటికి చేరతారో వేచిచూడాలి!

వైఎస్సార్ తో బాబుకు పోలిక లేదు: ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నారు.

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ఉరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కు చివరి అవకాశంగా తెలంగాణ సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరి తీయబడుతోందని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడతారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయిన కారణంగానే తాము దీక్ష చేపట్టామని 'సాక్షి'తో శ్రీనివాస గౌడ్ చెప్పారు.

YS జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష


షర్మిల వద్ద ఖమ్మం జిల్లా గిరిజనుల ఉద్వేగం
కరెంటు చార్జీలు, పెరిగిన ధరలతో కుదేలైపోతున్నామని ఆవేదన
జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష
ఎన్నికలు పెట్టి చూస్తే తెలుస్తుందంటూ సర్కారుకు సవాల్

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాగరికపు మాయామర్మం తెలియని అమాయక గిరిజనులు వాళ్లు.. సమాజానికి దూరంగా అడవిలోకి విసిరేసినట్టుగా అక్కడక్కడ వారి తండాలు. మన్ను పండితే దేవుడికి దండం పెట్టి పండగ చేయడం... కరువొస్తే పస్తులుండటమే వాళ్లకు తెలుసు. సాయం చేసినోళ్లను గుండెల్లో పెట్టుకోవడం.. వాళ్ల సహజ గుణం. ఖమ్మం జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో సాగుతున్న షర్మిల.. బూడిదంపాడు వద్ద ఆ గిరిజనాన్ని చూసి ఓ మర్రి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని వారితో మాట్లాడారు.
కడుపులో కల్మషం లేకుండా, కుండబద్ధలు కొట్టినట్టు ఆ గిరిజనులు ఆమెతో మాట్లాడారు. పెరిగిన కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలతో తాము కుదేలైపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ తరఫున పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు. ‘‘జగన్‌రెడ్డిని జైల్లో పెట్టామని సంబరపడుతున్నారు... జగన్ జైల్లో లేడు.. మా గుండెల్లో ఉన్నాడు. వైఎస్సార్ మా పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్నాడు. ఒక్కసారి ఎన్నికలు పెట్టి సూడురి జగన్ ఎక్కడున్నాడో చూపిస్తాం’’ అని ఆ గిరిజన మహిళలు.. పాలకులకు సవాల్ విసిరారు. రచ్చబండలో సంభాషణ సాగిందిలా..

షర్మిల: అమ్మా..అయ్యా! మీలో మాట్లాడాలనుకునే వాళ్లుంటే చెయ్యి లేపండి, మీకు మైకిస్తాం. మహిళలు మాట్లాడిన తరువాత రైతులు, విద్యార్థులు కూడా మాట్లాడవచ్చు. 

భూక్యా కౌసల్య: అందరికీ నమస్కారం! వైఎస్సార్ ఉన్నప్పుడు మేం ఎంత మంచిగున్నమో.. అంత మంచిగున్నాం. ఏనాడు ఇబ్బంది కలుగలే మాకు. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ లెక్కజేయట్లేదు. బేంకుకు పోతే ఏ.. ఏందమ్మా ఎందుకొచ్చినవ్ అంటరు. కరెంటు బిల్లు ఇష్టమొచ్చినట్టు కట్టుకుండ్రు. ఒక్క బలుబుకు రూ.1000 కట్టుకుంటున్నరు. మేం బతకాలంటే చాలా కష్టమయితంది.

షర్మిల: వ్యవసాయం ఎలా ఉందమ్మా?
భూక్యా రాణి: వ్యవసాయం సేత్తాన్నామని మాటే కానీ ఎన్నడూ గింజ సేతికి రాలేదు. విత్తనం వేసినప్పుడు వానాలు రావు. సేను నోటికాడికి వచ్చినప్పుడు వరదొచ్చి మొత్తం కొట్టుకొని పోతది. ఆసుపత్రికి పోతే రూపాయికి రెండు రుపాయలు రాత్తున్నరు. జగన్ రావాలె.. అప్పుడే మేం తినాలె.

షర్మిల: ఏం పంటలు వేసుకున్నారు తల్లి?
అల్లం సీతమ్మ: పత్తి తోట పెట్టుకున్నావమ్మా, ఐదెకరాలేసినాగాని ఐదు కింటాలు రాలే. మందు కట్టల కు పోతే రూ.1000, రూ.2000 కట్టుకుట్టున్నరమ్మా.

షర్మిల: దిగుబడి తగ్గిందా తల్లి?
సీతమ్మ: అవునమ్మా... నీళ్లు లేక పత్తి ఎల్లలేదమ్మా.

షర్మిల: పొలానికి కరెంటు ఎంత సేపు వస్తుంది?
బదావత్ కమ్లీ: అప్పుడప్పుడు అర్ధ గంట ఇడుస్తరు. మొత్తం 2 గంటలు కూడా ఇడువరమ్మా. అప్పుకోసం బేంకుకు పోతే బయటికి నెట్టేత్తున్నరు.

షర్మిల: అసలు రుణాలు రావడం లేదా? పావలా వడ్డీ రుణాలు రావడం లేదా?
తేజావత్ ప్రమీల: అసలు రుణాలే ఇత్తలేరమ్మా. టీవీల కిరణ్‌కుమార్‌రెడ్డి వడ్డీ లేకుండనే అప్పులు ఇత్తున్నామని చెప్తున్నడు. బేంకుకు పోతే.. ఎల్లి.. ఆడికిపోయి అడుగుపో అని మేనేజర్ అంటడు.

షర్మిల: కొద్దిగా ఓపిక పట్టండి ... త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ అందరికీ వడ్డీ లేని రుణాలు వస్తాయి.

YS షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం

బుడిదంపాడు:షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ సీఎస్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మడమ భాగంలోని కండరానికి గాయమైందని, కనీసం ఒకరోజు విరామం తీసుకోవాలని వారు సూచించారు. దీంతో సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యాత్ర తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.

వైయస్‌ జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది

శ్రీకాకుళం, 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ ఫోబియా‌ కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌ను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడానికే కాలం వృథా చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని కృష్ణదాస్ ‌అన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో విస్తృతంగా చేరికలు

తాడిపత్రి (అనంతపురం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యం అని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనితో అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిత్రచేడు, మొలకతాళ్ల, గోపురాజపల్లి, రాంపురం గ్రామాల్లోని 500 కుటుంబాల వారు ఆదివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చిత్రచేడులో జరిగిన కార్యక్రమంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌‌ రెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
వరంగల్‌లో 200 మంది చేరిక :
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు రాజా వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన‌ 200 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

విశాఖపట్నంలో 100 మంది టిడిపి కార్యకర్తలు చేరిక :
విశాఖపట్నం జిల్లా ఆనందపురానికి చెందిన 100 మంది టిడిపి కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. కోరాడ రాజబాబు సమక్షంలో ‌వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Stampede, lathicharge in Minister Chiru meeting


Gowribidanur, April 28: There was a stampede when the union minister Chiranjeevi came to campaign in some of the areas of Telugu population of Karnataka, on behalf of Congress.

In Gowribidanur, a place with a thick population of Telugu settlers, fans of the former Mega Star pushed each other, to have a look at him. There was stampede. Police had to lathi-charge the crowds to bring order. Chiranjeevi is going to tour areas with Telugu population asking the people to vote for Congress. It may be recalled that union minister and late N T Rama Rao’s daughter Purandareswari also toured some of the areas with Telugu population and

YS Sharmila Speech In Mucherla, Khammam District


చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ













చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ 

మరో ప్రజాప్రస్థానం 15-04-2013