Wednesday 8 May 2013

రచ్చపై హీరో రామ్ చరణ్ వివరణ!

హైదరాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన రచ్చపై హీరో రామ్ చరణ్ స్పందించారు. తన సెక్యూరిటీ చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తనకు క్షమాపణ చెప్పారని తెలిపారు. వాళ్లు చాలా దురుసుగా డ్రైవింగ్ చేశారని, తన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని ఐఎఎన్ఎస్ వార్తా సంస్థతో ముంబైలో చెప్పారు. క్షమాపణ కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా దర్యాప్తు చేశారని కితాబిచ్చారు. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదన్నారు. అయితే క్షమాపణ కోరుతూ బాధితుల నుంచి తమకు ఎటువంటి లేఖ అందలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పడం కొసమెరుపు. 

0 comments:

Post a Comment