
మే 25న జరిగిన కాల్పుల్లో గాయపడిన శుక్లాను ముందు జగదల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రికి తీసుకు వచ్చారు. గత వారం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినా, ఆ తర్వాత క్షీణించింది. శుక్లా మృతితో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 29కి పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విద్యా చరణ్ శుక్లా, తొమ్మిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్ కేబినెట్లో ఆయన కీలక శాఖలు నిర్వహించారు.
0 comments:
Post a Comment