Wednesday 8 May 2013

సుప్రింకోర్టు తీర్పు- చంద్రబాబు పై అనుమానం

సుప్రింకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా లేదని, అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పి ఉండవలసిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెబుతూనే సుప్రింకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే సమయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు డిల్లీలోనే ఉండి ఏమి చేశారని, జగన్ కు బెయిల్ రాకుండా చేయడంలో ఎలాంటి కృషి చేశారో తెలియాల్సి ఉందని మరో నేత జూపూడి ప్రభాకరరావు అన్నారు.సుప్రింకోర్టు తీర్పు ప్రభావితమైందని అంటున్నారా అని అడగ్గా అలా అనడం లేదని అంటూనే టిడిపి బృందం అంతా హోటల్ లో ఎందుకు కూర్చున్నారో చెప్పాలని అన్నారు.మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు కేసు ప్రభావితం చేయకుండా ,అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పాలని శ్రీకాంత రెడ్డి ప్రవ్నించారు.కాగా కొణతాల రామకృష్ణ సిబిఐపై సుప్రింకోర్టు పంజరంలో చిలుక మాదిరి సిబిఐ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇలాంటి తీర్పు రావడం దురదృష్టకరమని కొణతాల రామకృష్ణ అన్నారు.

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆలోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్ కోసం పిటిషనర్ ట్రయిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బెయిల్ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. 

విజయ సాయిరెడ్డి బెయిల్

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ న్యాయస్థానం నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

కాసేపట్లో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావటంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా ఈరోజే తీర్పు వెలువడనుంది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ వర్గీయులపై వేటు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ దంపతులకు అనుయాయులుగా ఉన్న నలుగురు జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీం.రాధ, మసూద్, మోమన్ రావు తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నట్లుగా అనుకోవాలి.

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్

ఖమ్మం : జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన గురువారమిక్కడ తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని అజయ్ కుమార్ తెలిపారు.

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తారు. జగన్‌తో పాటుగా ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్, విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్లపైనా తీర్పు రానుంది. మూడు తీర్పులనూ వేర్వేరుగా ఇవ్వనున్నారు.

YS జగన్ బెయిల్ కోసం సర్వమత ప్రార్ధనలు

మహేశ్వరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత దీపాభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్వమత ప్రార్థన కార్యక్రమంలో భారీ ఎత్తున్న అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

సీఎం కిరణ్ కు మరో షాక్!

వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో సీఎం కిరణ్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. వరంగల్ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ తీర్పు ప్రకారమే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

వైఎస్ హయాంలో రైతు రాజుగా మారాడు: YS షర్మిల


ఖమ్మం: ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ.. వ్యవసాయం దండగ అన్న ఘనత చంద్రబాబుదేనని షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్టులు కడితే నష్టం అని బాబు వ్యవసాయాన్ని నీరుగార్చారని షర్మిల ఆరోపించారు. చందుగొండ మండలం ఎర్రగుంటలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో రైతులను పురుగుల్లా చూశారు అని అన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాకే రైతు రాజుగా మారాడని షర్మిల తెలిపారు. 
ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైఎస్ఆర్ గిరిజనులకు 2లక్షల ఎకరాల అటవీభూములపై హక్కు కల్పించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహానేత వైఎస్ బతికుంటే ఈ జిల్లాలోనే మరో 6లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చేవారని షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కిరణ్‌ సర్కార్ అటకెక్కించిందని.. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది..ఇక పక్కా ఇళ్లకు ఏకంగా పాడి కట్టేశారని షర్మిల ధ్వజమెత్తారు. కిరణ్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంపునకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడని షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌కు ప్రజల్లోని విశ్వసనీయత జగనన్నకు కూడా ఉందని ప్రజల నమ్మకమని షర్మిల అన్నారు. 

YS జగన్ బెయిల్ పై పెరుగుతున్న ఆశలు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఆయన అభిమానులకు ఆశలు పెరుగుతున్నాయి.ప్రత్యేకించి బొగ్గు కుంభకోణం, ఇతర కేసులలో సిబిఐపై సుప్రింకోర్టు తీవ్రంగా మండిపడ్డ నేపధ్యంలో జగన్ కు బెయిల్ రావచ్చని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు.ఆయా కేసులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై సుప్రింకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.సిబిఐ పంజరంలో చిలకలా మారిందని వ్యాఖ్యానించడం సంచలనంగానే ఉంది.ఆయా కేసుల దర్యాప్తులలో అదికారులతో సంప్రదించవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చని తెలిపింది.ఇలాగ పరిస్థితి కొనసాగితే.సిబిఐ ప్రతిపత్తి విషయంలో కోర్టు చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా సుప్రింకోర్టు కూడా హెచ్చరించింది.న్యాయశాఖ మంత్రి సలహా మేరకే ఆయన వద్ద సమావేశం నిర్వహించామని సిబిఐ తెలిపింది.జగన్ కేసులో కూడా పిబిఐ రాజకీయ ప్రేరితంగా చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.జగన్ తరపు న్యాయవాదులు దీనిపై వాదించారు. సరిగ్గా సుప్రింకోర్టు కూడా సిబిఐని మందలించిన తరువాత ఒకటి,రెండు రోజులలో జగన్ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉంది.అందువల్ల వారు జగన్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు.

కాంగ్రెస్‌ది ధృతరాష్ట పాలన: భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: కిరణ్ సర్కార్ పథకాలేవీ ప్రజలకు మేలు చేసేవికావని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అవి ప్రకటనల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ధృతరాష్ట పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 

ఉపఎన్నికలు పెట్టండి: వైఎస్‌ఆర్ సీపీ నేత శోభా నాగిరెడ్డి

హైదరాబాద్: కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలోనూ వస్తాయనుకుంటే ఉపఎన్నికలు నిర్వహించాలని వైఎస్‌ఆర్ సీపీ నేత శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలని చురక అంటించారు. అవిశ్వాసం సందర్భంగా విప్‌ ధిక్కరించిన వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. సీబీఐ వ్యవహారశైలిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. 

కాంగ్రెస్ చంకలు గుద్దుకోక్కర్లేదు: సబ్బం హరి

విశాఖపట్నం: కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ చంకలు గుద్దుకోవక్కర్లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం మనరాష్ట్రంలో ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

నా పుట్టినిల్లు వైఎస్సార్‌సీపీ : కొణతాల రామకృష్ణ

‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్‌సీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ నుంచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్సార్‌సీపీ నాకు పుట్టినిల్లు లాంటిది. వైఎస్‌తో, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం విడదీయనటువంటిది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదని, కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఆ పార్టీని వదిలేసినట్లు తెలిపారు. తాను బ్యాక్‌డోర్ నుంచి వచ్చిన నాయకుడిని కాదని, పోరాటాలు చేసి పైకొచ్చానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందున్నానని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.

డాక్టర్ కుడిపూడి వైఎస్ఆర్

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి 2009 సాదారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసిన డాక్టర్ కుడిపూడి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం శ్రీనివాస్‌తో పాటు వచ్చిన టీడీపీ నేత డాక్టర్ ఎ.సాంకత్యాయన్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రచ్చపై హీరో రామ్ చరణ్ వివరణ!

హైదరాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన రచ్చపై హీరో రామ్ చరణ్ స్పందించారు. తన సెక్యూరిటీ చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తనకు క్షమాపణ చెప్పారని తెలిపారు. వాళ్లు చాలా దురుసుగా డ్రైవింగ్ చేశారని, తన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని ఐఎఎన్ఎస్ వార్తా సంస్థతో ముంబైలో చెప్పారు. క్షమాపణ కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా దర్యాప్తు చేశారని కితాబిచ్చారు. పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదన్నారు. అయితే క్షమాపణ కోరుతూ బాధితుల నుంచి తమకు ఎటువంటి లేఖ అందలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పడం కొసమెరుపు. 

కాంగ్రెస్ విజయంకాదు - బిజెపి ఓటమి: గట్టు రామచంద్ర రావు

హైదరాబాద్: కర్ణాటకలో బీజేపీ ఓటమి తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదని వైఎస్ఆర్ సిపి నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలోనూ వస్తాయనుకుంటే ఉపఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు ఉపఎన్నికలంటే ఎందుకంత భయం? అని ఆయన అడిగారు. 

మెజారిటీ(121) సాధించిన కాంగ్రెస్

కర్ణాటక: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 113 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు 223 స్థానాలలో ఎన్నికలు జరిగాయి. బిజెపి 38, జెడి(ఎస్) 36, కెజెపి 4, ఇతరులు 14 స్థానాలలో గెలుపొందారు. 

సినీహీరో రామ్‌చరణ్‌పై హెచ్ఆర్ సిలో ఫిర్యాదు

హైదరాబాద్ : సినీహీరో రామ్‌చరణ్‌పై మానవహక్కుల సంఘం( హెచ్ ఆర్ సి)లో ఫిర్యాదు చేశారు. సాప్ట్ వేర్ ఉద్యోగులపై దాడి కేసులో రామ్ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్ ఆర్ సిని ఆశ్రయించారు. 

నరేంద్ర మోడీకి దెబ్బ- రాహుల్ కు ఘనత

దేశవ్యాప్తంగా తన ప్రభావం పెంచుకోవాలనుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కర్నాటక ఫలితాలు ఆశాభంగం కలిగించాయి.ఆయన ప్రభావం పనిచేయలేదని కర్నాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోడీ మంత్రం పని చేయలేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని సిద్దరామయ్య అంటున్నారు.. అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సిద్దరామయ్య చెబుతున్నారు.