Sunday 5 May 2013

రేపే జగన్ కు బెయిల్

" జగన్ సోమవారం బెయిల్ పై బయటకు వస్తారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలన్నీ చాప చుట్టేసినట్టు ఒకే దిక్కు.. వై సీ పీ వైపు తిరుగుతాయి" అని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సి జూపూడి ప్రభాకరరావు అన్నరు. బెయిల్ వస్తుందని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే.. 'కోర్టులపై గురవం ఉన్న ఆశావాదులం. జగన్ కు 6న బిల్ వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. అది మా విశ్వాస స్తాయి' అని బదులిచ్చారు. అయన శనివారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ ను జైలు లో పెట్టి 11 నెలలు అయిపోయిoదని, వాస్తవానికి 90 రోజుల తర్వాతే బెయిల్ ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్ కనుసైగ చేస్తే ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని, కాని వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కుల్చబోమని జగన్ ఇది వరకే చెప్పారని గుర్థుచెశారు. వైసిపీలో చేరుతున్న వారిని తిట్టించటం చంద్రబాబు కు తగదని జూపూడి హితువు పలికారు. "గేట్లు తెరవటం గురుంచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన గేట్లు తెరిస్తే వాళ్ల పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉండరు. ఉన్న వాళ్ళే పోతారు" అని ఎద్దేవా చేశారు . కొండ మీద ఉన్నారా? లోయలో ఉన్నారా? అనేది చూసుకోవాలని, తమ పార్టీ లోకి వచ్చే వారిని విమర్శిస్తే ఉరుకోనేది లేదని హెచ్చరించారు. వై సి పీ లోకి వస్తున్నా వారు పదవుల కోసం వచ్చిన వారు కాదని,  ప్రజా సేవ కోసమే వస్తున్నారని చెప్పారు. అయితే వారు ఏ పార్టీ లో ఉంటే, ఆ పార్టీ తరపున మాట్లాడుతారని అనుకోవట్లేదన్నారు. సుదిర్ఘమైన అనుభవం తో వస్తున్న దాడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శంకర్ రావు వస్తానంటే పార్టీ లోకి తీసుకుంటారా అని ప్రశ్నిస్తే ... ఆయనను మాత్రం చేర్చుకోబోమని జూపూడి స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment