Tuesday 4 June 2013

కెసిఆర్ ప్రజల ఆస్తి

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై చేసిన విమర్శలను ఆయన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు ఘాటుగా తిప్పికొట్టారు.తాము ఉద్యమంలో పాల్గొంటే మీరు పదవులలో కులుకుతారా అని ఆయన సీరియస్ గా ప్రశ్నించారు.తెలంగాణ ద్రోహులు చట్టసభలలో ఉంటే,తెలంగాణ బిడ్డలు రోడ్లపై ఉండాలా అని ఆయన ప్రశ్నించారు.టిఆర్ఎస్ కు ఓట్లు ,సీట్లు రాకూడదా అని కెటిఆర్ ప్రశ్నించారు.ఓట్లు,సీట్లతోనే టిఆర్ఎస్ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తుందని ఆయన స్పష్టం చేవారు.మంత్రి శ్రీధర్ బాబును మంధని దాటితే ఎవరూ గుర్తించరని, కెసిఆర్ ఇప్పటికే మూడు జిల్లాలలో గెలిచారని ఆయన అన్నారు.కెసిఆర్ ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
కెసిఆర్ ఎక్కడ నుంచి పోటీచేసినా గెలుస్తారని తారకరామరావు సవాల్ చేశారు.

0 comments:

Post a Comment