Wednesday 22 May 2013

ఆ జీవోల జారీలో తప్పేమీ లేదు: లగడపాటి రాజగోపాల్

హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు తమ శాఖలకు సంబంధించి జారీచేసిన జీవోలలో ఎక్కడా తప్పులేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అలాంటి జీవోలను అంతకు మందున్న ప్రభుత్వాలు వందల సంఖ్యలో ఇచ్చాయన్నారు. ‘ఒక కంపెనీకి కేటాయించిన గనులను వేరొక కంపెనీకి బదలాయించిన’ట్లు సబితను తప్పుపడుతున్నారని, కానీ అలాంటి జీవోలు తెలుగుదేశం సర్కారు హయాంలో అనేకం వచ్చాయన్నారు. 2004కు ముందు అలాంటి బదలాయింపు ఒప్పందాలు 53 జరిగాయంటూ వాటి వివరాలను బుధవారం మీడియాకు అందజేశారు. ‘తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జీవోలు తప్పు అంటారు. ప్రభుత్వానికి జీవోలు ఇచ్చే అధికారం లేదా? మంత్రులు, అధికారులు జీవోలపై సంతకాలే చేయకూడదా? మంత్రిగా ఒకరిచ్చిన గనులను ఆ తరువాత మరొకరికి బదలాయిస్తే ఆ జీవోలో తప్పు ఎక్కడిది? అని అన్నారు.

0 comments:

Post a Comment