Monday 3 June 2013

నిజాయితీపరులు టిడిపిలో ఎలా ఉంటారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చిరంజీవి బహిరంగంగా అమ్ముడుపోతే, చంద్రబాబు తెరవెనుక అమ్ముడుపోయారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే...ఆ పార్టీ నుంచి నీతిపరులైనవారు వలసబాట పడుతున్నారని ఆమె సూత్రీకరించారు. చంద్రబాబు తన హయాంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిల అడుగుతున్నారు.
ప్రతి ఎన్నికలోనూ, అవిశ్వాస సమయంలోనూ కాంగ్రెస్‌తో బాబు జతకట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు తీరుతో నిజాయతీపరులైన నాయకులు టీడీపీలో ఎలా ఉంటారని కూడా ఆమె అనడం విశేషం.షర్మిల ప్రశ్న ద్వారా ఎదురుదాడి చేస్తున్నారన్నమాట.

0 comments:

Post a Comment