Sunday 28 April 2013

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ఉరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కు చివరి అవకాశంగా తెలంగాణ సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరి తీయబడుతోందని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడతారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయిన కారణంగానే తాము దీక్ష చేపట్టామని 'సాక్షి'తో శ్రీనివాస గౌడ్ చెప్పారు.

0 comments:

Post a Comment