Sunday 28 April 2013

వైయస్‌ జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది

శ్రీకాకుళం, 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ ఫోబియా‌ కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌ను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడానికే కాలం వృథా చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని కృష్ణదాస్ ‌అన్నారు.

0 comments:

Post a Comment