Sunday 12 May 2013

3న నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరిక?

హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే నెల 3న కాషాయతీర్థం తీసుకునే అవకాశముంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరితో నాగం చర్చలు జరిపారని, బీజేపీలో చేరాల్సిందిగా సూచించారని తెలిసింది. 

0 comments:

Post a Comment