Sunday 12 May 2013

టిడిపిది భావదారిద్ర్యం

తెలుగుదేశం పార్టీ బావదారిద్ర్యంలో ఉందని పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేయడం కాకుండా, దమ్ముంటే టిడిపి నేతలు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని సూచించారు.తనను రాజకీయ వ్యభిచారి అనడాన్ని,తాను దళితుడుని కానని టిడిపి నేతలు మోత్కుపల్లి , ఇతర నేతలు ప్రచారం చేయడం మానుకోవాలని,టిడిపికి ఏమి చెప్పాలో తెలియక ఇలాంటి బావదారిద్ర్యపు మాటలు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment