Saturday 25 May 2013

రాష్ట్రంలో భానుడి భగభగ:62 మంది మృతి


హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులకు జనం మృత్యువాతపడుతున్నారు. వడదెబ్బతో ఈరోజు 62 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఆరుగురు, వైఎస్ఆర్‌ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం, విజయనగరం, రంగారెడ్డ, ఖమ్మం, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మంమండలం కంపలో వడగాలులకు వృద్ధురాలు మృతి చెందింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నత్తవలసలో యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం కత్తులూరులో వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందాడు. నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్.మండలం గట్టికల్లులో వడదెబ్బతో ఒక వృద్ధుడు, కోటపహాడ్‌లో మరోయువతి, త్రిపురారం మండలంలో ఒకరు, హాలియా మండలం తిరుమలగిరిలో ఒకరు మృతి చెందారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి అమర్‌నగర్‌లో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ బస్టాండ్‌లో ఒకరు, హుస్నాబాద్‌లో పసిపాప, జూలపల్లిలో ఒకరు, కాచారంలో ఒకరు, వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో ఒకరు మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లా కాటారంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం రామిరెడ్డినగర్‌లో ఒకరు మృతి చెందారు. వరంగల్ జిల్లా సంగ్యం మండలం తీగరాజుపల్లిలోవృద్దుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నిడగల్లులో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా బాపట్లలో వృద్ధుడు, మాచర్లలో ఇద్దరు మృతి, అమరావతిలో ఇద్దరు , దుగ్గిరాలలో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో ఇద్దరు, కంతి మండలం తడకల్లులలో ఒకరు మృతి చెందారు.

0 comments:

Post a Comment