Friday 3 May 2013

జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ :సకల జనుల సమ్మె సమయంలో హైకోర్టులో విధ్వంసం సృష్టించిన కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయటం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిట్టనిలువుగా చీలిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టులో ఇలాంటి విధ్వంసాలను తామెన్నడూ వినలేదని, జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 

0 comments:

Post a Comment