Thursday 30 May 2013

ప్రార్ధనల కోసం జెరుసలెమ్ కు జోగి రమేష్

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ జెరుసలెమ్ వెళుతున్నారు.ఆయన ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ను ఉల్లంఘించి మరీ జగన్ కు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు ఆయన జెరుసలెమ్ కు వెళుతున్న కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ ను బెయిల్ రావాలని,వై.ఎస్.కుటుంబానికి మేలు జరగాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయడానికి తాను జెరుసలెమ్ వెళుతున్నట్లు ఆయన చెబుతున్నారు.గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి జెరుసలెమ్ వెళ్లి వస్తుండేవారు.

0 comments:

Post a Comment