Thursday 9 May 2013

కోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు: వైఎస్ విజయమ్మ


హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ పని తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ పై కుట్ర పన్నాయని విజయమ్మ ఆరోపించారు. పార్టీని వీడినందుకే కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని విజయమ్మ స్పష్టం చేశారు. 

0 comments:

Post a Comment