Thursday 9 May 2013

'సీబీఐ చిలుక పలుకుల్ని కోర్టులు నమ్మాయి'


న్యూఢిల్లీ : సీబీఐ చిలుక పలుకులను న్యాయస్థానాలు నమ్మాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అయితే న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని....మరో నాలుగు నెలలు తర్వాత అయినా న్యాయమే గెలుస్తుందన్నారు.
రాజకీయ క్రీడలో జగన్ పావుగా మారారని అంబటి రాంబాబు అన్నారు. జగన్ ను మరో ఏడాది జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బెయిల్ రానంతమాత్రాన పార్టీ శ్రేణుల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆ మైండ్ గేమ్ లో పడవద్దని అంబటి సూచించారు. కాంగ్రెస్, టీడీపీని ఓడించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

0 comments:

Post a Comment