Friday 24 May 2013

YSజగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా 27న ర్యాలీ!

హైదరాబాద్: ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించిన తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు తరలి రావాలని వైఎస్ భారతి పిలుపునిచ్చారు. మే 27 తేది సోమవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని వైఎస్ భారతి విజ్ఞప్తి చేశారు. జగన్ కు బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కొవ్వొత్తితో తరలిరావాలి అని అభిమానులను వైఎస్ భారతీ కోరారు.

1 comment:

  1. Arrest chesi one year avthundi ippudu thelisinda Akrama Nirbandham ani..............

    ReplyDelete