Friday 24 May 2013

'టీఆర్ఎస్ లో చేరేందుకు ఎర్రబెల్లి యత్నం'


వరంగల్: టీఆర్ఎస్ లోకి రావడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ మాజీ పొలిట్ బ్యురో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. ఓ ఫౌల్ట్రీ యజమాని ద్వారా, ఓ పెద్ద బిల్డర్ ద్వారా ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకంటే ముందు నుంచే టీఆర్ఎస్ లో చేరేందుకు వారు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 

చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఎర్రబెల్లి, రేవూరికి కడియం హితవు పలికారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ నేతలు దమ్ముంటే మహానాడులో చంద్రబాబుతో ఒక్కసారి జై తెలంగాణ అనిపించగలరా అని సవాల్ విసిరారు. 

0 comments:

Post a Comment