Sunday 9 June 2013

ముఖ్యమంత్రి కిరణ్ ను అసమ్మతి మంత్రులు ఏమీ చేయలేరా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందా?కాంగ్రెస్ లో ఆయనదే పై చేయి అవుతోందా?కాంగ్రెస్ లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని తుంచడానికే మొగ్గు చూపుతోందని సి.ఎమ్ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది. వైద్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని బర్తరఫ్ చేసిన తీరు పై అసమ్మతి ఏర్పాడింది. అసమ్మతి మంత్రులు డిల్లీ వెళ్లి దానిపై తమ అబిప్రాయాలు చెప్పినా అధిష్టానం సీరియస్ గా పట్టించుకోలేదన్న అబిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి జానారెడ్డి వంటి వారు డి.ఎల్.ను బర్తరఫ్ చేసిన తీరుపై బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మంత్రివర్గ భేటీలో వారు దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తారని ప్రచారం జరిగింది.కాని అసలు ఆ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనించదగిన అంశంగా ఉంది. డి.ఎల్. బర్తరఫ్ అదిష్టానం పెద్దలకు చెప్పే సి.ఎమ్. చేశారన్నది ఒక వాదనగా ఉంది.ఇక ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీ యాత్ర చేసినా పెద్దగా ఒరిగింది లేదని సి.ఎమ్. శిబిరం వ్యాఖ్యానిస్తోంది. మెదక్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా దామోదరకు లేని విషయాన్ని అదిష్టానం గుర్తించిందని, అదే విషయాన్ని ఆయనతో అదిష్టానం పెద్దలు ప్రస్తావించారని,దాంతో ఆయన వైఖరిలో కొంత మార్చు వచ్చిందని కొందరు చెబుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ వద్ద దామోదర్ ప్రవర్తించిన తీరును వారు ఉదహరిస్తున్నారు. ఆయన చాలా వినయంగా కనిపించారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. సోనియాగాందీ గతంలో కన్నా ఇప్పుడు చాలా విషయాలు సేకరించి వచ్చినవారితో మాట్లాడుతున్నారని, దాంతో ఏదో ఒక ఫిర్యాదు చేయాలని వెళ్లినవారే ఇబ్బంది పడవలసి వస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి కిరణ్ కు ఎన్నికలవరకు ఎదురు లేదని అనుకోవచ్చా!

0 comments:

Post a Comment