Sunday 9 June 2013

రేవంత్ డిమాండ్ కే సిబిఐ స్పందించిందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు కొత్త ఆరోపణ సంధిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాతే సిబిఐ విజయసాయి రెడ్డి, జగన్ లను ఒకే జైలులో ఉంచరాదని కోర్టులో మెమో దాఖలు చేసిందని రాంబాబు అంటున్నారు.ఇక్కడే అనుమానం వస్తోందని ఆయన చెబుతున్నారు.ఇప్పటివరకు నిందితులను వేర్వేరు జైళ్లలో ఉంచాలని సిబిఐ కోరలేదని,రేవంత్ రెడ్డి కోరిన తర్వాతే ఇది జరిగినట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారనే కారణంతోనే జగన్‌ను అరెస్టు చేశారని, అలాంటప్పుడు సిబిఐ ఈ విధంగా ఎలా వాదిస్తుందని ఆయన ప్రశ్నించారు.జగన్‌ను మానసికంగా వేధించి లబ్ధి పొందాలని కాంగ్రెస్, టీడీపీలు చూస్తున్నాయని , అందుకోసం సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని రాంబాబు ఆరోపించారు.

0 comments:

Post a Comment