Sunday 9 June 2013

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాతో మందకృష్ణ భేటీ ఆంతర్యం!

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంపై బాగానే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మద్య కాలంలో ఆంద్రప్రదేశ్ కు సంబందించిన పలువురు నేతలు,ప్రముఖులను ఆమె కలుసుకుని ఆయా అంశాలపై మాట్లాడుతున్నారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. తాజాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అదినేత మంద కృష్ణ మాదిగ తో కూడా ఆమె సమావేశం అయ్యారు.ఎస్ సిలను వర్గీకరణ చేయాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు మంద కృష్ణ చెప్పారు. ఎస్ సిలను వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ ఆ వర్గాల ఓట్లు కోల్పోతుందని ఆయన ఆమెతో అన్నారు.వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.కేవలం ఈ ఒక్క అంశం మాత్రమే చర్చించారా?లేక రాష్ట్ర రాజకీయాలపై కూడా సోనియా ఆరా తీశారా అన్నది చర్చనీయాంశం. ఒకవేళ ఆమె ఇతర విషయాల గురించి కూడా మాట్లాడి ఉంటే ఆమె రాష్ట్రంపై , ఇక్కడి కాంగ్రెస్ పరిస్థితులపై బాగా ఆందోళన చెందుతున్నారని అర్దం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment