Saturday 4 May 2013

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమత బెనర్జీ

పానిహతి: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.తద్వారా దేశ రాజకీయాల్లో నాలుగు కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై సంకేతాలిచ్చారు.‘కేంద్రంలో ఇక మూడో యూపీఏ ప్రభుత్వం ఉండకూడదు. కేంద్రంలో ప్రజానుకూల, సుస్థిర ప్రభుత్వాన్ని అందించడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలి’ అని అన్నారు. ఆమె శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతిలో జరిగిన తృణమూల్ సభలో మాట్లాడారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మూడో పర్యాయం యూపీఏ సర్కారు ఏర్పాటవకుండా అడ్డుకునే సత్తా మనకుంది’ అని అన్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎంలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు 

0 comments:

Post a Comment