Saturday 4 May 2013

ఇలాగైతే కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఉండరాదు..

కర్నూలు జిల్లా లో సహకార ఉద్యోగి ఒకరిని కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేసిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని రక్షించలేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక క్షణం కూడా పాలించే అర్హత లేదని అన్నారు.ఆ ఉద్యోగి మూడు నెలల క్రితం నుంచి కనిపించకపోతే, దాని గురించి తమ నాయకుడు కె.ఇ.కృష్ణమూర్తి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన అన్నారు.కిడ్నాప్ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేశారని ఆయన ఆరోపించారు.అతనిని ఏమి చేశారు? హత్య చేశారా?ఏమైనా చేశారా అన్నది కూడా ఇంతవరకు తేల్చలేదని చంద్రబాబు అన్నారు. కిడ్నాపర్లు, హంతకులను రక్షించే పనిలో కిరణ్ ప్రభుత్వం ఉందా అని ఆయన అన్నారు.అక్కడ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఫ్యాక్షనిస్టు అని ఆయనకు ఈ కేసుతో సంబందం ఉందని ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు.ప్రతి విషయంలో రాజకీయ జోక్యం తగదని చంద్రబాబు స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment