Friday 17 May 2013

మోసం చేయడానికే కెసిఆర్ కంకణం


తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావుపై మళ్లీ విమర్శలు కురిపించడానికి కాంగ్రెస్ నేతలు సన్నద్దమవుతున్నట్లుంది.గతంలో తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ నేతలు కెసిఆర్ పై విమర్శలు చేయడానికి వెనుకాడుతుంటారు.కాని ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సంతోష్ కుమార్ కెసిఆర్ విమర్శల వర్షం కురిపించారు. కోటీశ్వరులకు టికెట్లు అమ్ముకుని, తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తే నిర్బంధ ఉచిత విద్య అని కేసీఆర్ అంటున్నారని, టిఆర్ఎస్ లో చేరినవారి విద్యాసంస్థల కళాశాలల్లో ఎంతమందికి ఉచిత విద్య అందిస్తున్నారని సంతోష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు.టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఎలక్షన్, కలెక్షన్ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

0 comments:

Post a Comment