Friday 17 May 2013

టిడిపి తెలంగాణ లేఖలో సారం లేదా!

రాజకీయ నేతల అభిప్రాయాలు ఎలా మారిపోతాయో చెప్పడానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రకటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరపున తీసుకువెళ్లిన లేఖలో ఎలాంటి సారం లేదని కడియం అన్నారు. గతంలో తెలంగాణకు సంబందించిన లేఖ గురించి మాత్రమే ప్రస్తావన ఉందని అన్నారు.తానే ఆ లేఖ ఆధారంగా గట్టిగా మాట్లాడానని అన్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చినప్పుడు తెలంగాణ నేతలను ఒక గదిలో , సీమాంధ్ర నేతలను మరో గది లో ఉంచి చంద్రబాబు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు.విశేషం ఏమిటంటే కడియం శ్రీహరి అఖిలపక్ష సమావేశం రోజున టిడిపి వాదనను, ఆ లేఖలోని ప్రతి అంశాన్ని పట్టి,పట్టి చదివి వినిపించి గట్టిగా వినిపించి తెలంగాణకు టిడిపి అనుకూలం అని చెప్పారు. ఇప్పుడేమో ఆయనే ఆ లేఖలో ఎలాంటి సారం లేదంటున్నారు.ఒపినీయన్స్ మార్చుకోకపోతే రాజకీయ నాయకులు కారని నానుడి ఊరికే రాలేదు కదా!

0 comments:

Post a Comment