Friday 17 May 2013

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ దే పైచేయి


ఢిల్లీ లో అధిష్టానం పెద్దల వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే పైచేయి అయినట్లు కనిపిస్తుంది.జగన్ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులపై చర్య తీసుకోవాలా?వద్దా అన్నదానిపై అదిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ముఖ్యమంత్రి కిరణ్ ఈ మంత్రుల తరపున గట్టిగా వాదించారని చెబుతున్నారు.దానితో ఆ విషయంపై నిర్ణయాన్ని ఆయనకే వదలిపెట్టినట్లు కధనాలు వస్తున్నాయి.దర్మాన, సబిత తదితరులపై కేవలం ఆరోపణలే వచ్చాయని, అవి నిర్దారణ కాకుండా చర్య తీసుకోరాదన్నది ముఖ్యమంత్రి అబిమతంగా ఉంది. వారి రాజీనామాలను కూడా ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఇప్పుడు వారిని తొలగిస్తే ముఖ్యమంత్రి వైఖరి తప్పని తేలుతుంది.ఈ నేపధ్యంలో అదిష్టానం వద్ద తన వాదన వినిపించడం సఫలీకృతులైనట్లుగా ఉంది.

0 comments:

Post a Comment