న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధించిన కేసు ఇప్పుడు చాలా కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరపు న్యాయవాది అశోక్ భాన్ సుప్రీం కోర్టును కోరారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వాదించారు.
ఛార్జిషీటులో పేరున్నవారిని ఎందుకు అరెస్టుచేయలేదు? అని జగన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీష్ సాల్వే ప్రశ్నించారు. ఎంతటి తీవ్రబ నేరమైనా 90 రోజుల్లో ఛార్జిషీటు వేయాలని ఆయన తెలిపారు. కావాలనే సీబీఐ సాగదీస్తూ పోతోందని ఆయన వాదించారు.
0 comments:
Post a Comment