Sunday 5 May 2013

ఎన్ టీ ఆర్ ఛానల్ నీ కొంటున్న కాంగ్రెస్ పార్టీ

కర్ణాటక ఎన్నికలకు ఎన్ టీ ఆర్ స్టూడియో ఎన్ చేతులు మారటానికీ మధ్య సంబంధం ఉందంటున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈ ఛానల్ తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. నిజానికి రెండు నెలల కిందటి బేరసారాలు సాగినా, ఎన్నికల ఖర్చులుంటాయన్న ఉద్దేశంతో వాయిదా వేసుకన్నారట. ఆ నాయకుల తరపున వారికి సన్నిహితుడైన వ్యక్తి మధ్యవర్తిత్వం నెరపడం, ఛానల్ కార్యాలయాన్ని పరిశీలించి వెళ్ళటంతో బాటు ధర కుడా ఖాయమైoదని చెబుతున్నారు. పార్టీ గెలుపును బట్టి నిర్ణయం ఉంటుందని చెబుతున్నప్పటికీ, అమ్మకం విషయం లో ఇప్పుడు స్టూడియో ఎన్ ఆధిపతి మనసులో ఏమున్నదో వాళ్లకి తెలియకపోవచ్చు. ఏది ఏమైనా, ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చు. 

0 comments:

Post a Comment