Thursday 2 May 2013

6న జగన్ పార్టీ లో దాడి వీరభద్రరావు చేరిక


జగన్ పార్టీ లో చేరేందుకు దాడి వీరభద్రరావు దాదాపుగా రంగం సిద్దం చేసుకున్నట్టే. గురువారం టీడీపీ కి రాజీనామాను మెయిల్లో పంపిన దాడి.... వైసిపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మిని మాత్రం స్వయంగా కలుసుకున్నారు. చంచల్గూడ జైలు లో శుక్రవారం జగన్ను కలిసి... మిగతా విషయాలు మాట్లాడు కొనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెల 6న విజయలక్ష్మి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విశాఖ లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, కోణతాలతో సఖ్యతతో పనిచేస్తానని హామీ ఇచ్చి, తన కుమారుడు రాత్నాకర్కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వైసిపీ వర్గాలు చెబుతున్నాయి. 
ఐతే, దాడి మాత్రం ఈమధ్య మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకొవడం .... మరింత ఆసక్తి కలిగిస్తుంది.  అదే సమయం లో 'కిరణ్ కుమార్ రెడ్డి టచ్ లో ఉన్నారు' అని దాడి కుమారుడు రత్నాకర్ ద్రువికరిస్తున్న దరిమిలా..... దాడి చూపు కాంగ్రెస్ వైపు ఉన్నదనే ఉహాగానాలు వస్తున్నాయి. 

0 comments:

Post a Comment