Thursday 2 May 2013

ప్రాణమున్నంత వరకూ జగన్ తోనే: రెహ్మాన్


హైదరాబాద్ : తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నాననటం అవాస్తవమని.... ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఛానళ్లు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. మైనార్టీలకు జగన్ మాత్రమే న్యాయం చేయగలరని రెహ్మాన్ అన్నారు.

ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలని యెల్లో మీడియాకు రెహ్మాన్‌ విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ ఉందన్నారు. న్యూస్‌కు వ్యూస్‌కు తేడా ‌తెలుసుకోకుండా స్క్రోలింగ్‌లు వేయడం సరికాదని రెహ్మాన్ హితవు పలికారు. తనకు గాని, తన సామాజికవర్గానికి గాని అన్యాయం జరిగితే మీడియా ముందుకు వచ్చి తాను మాట్లాడతానన్నారు. అన్ని వర్గాల వారూ మంచిగా ఉంటేనే తామూ మంచిగా ఉంటామన్నారు.

0 comments:

Post a Comment