Thursday 2 May 2013

సోనియా గాంధీ నివాసం ఎదుట సిక్కుల ఆందోళన


న్యూఢిల్లీ : సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న సిక్కులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ నివాసం ఎదుట నిరసనకు దిగిన సిక్కులు ఏకంగా టెన్‌ జన్‌పథ్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సిక్కులు బారికేడ్లు ఎక్కి లోనికి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు.

తమకు న్యాయం చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జన్‌కు ఉరిశిక్ష విధించాలంటూ నినాదాలతో జన్‌పథ్‌ ప్రాంతం దద్దరిల్లింది. అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులబెట్టిన సిక్కులను పోలీసులు అతి బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. 

0 comments:

Post a Comment