Thursday 2 May 2013

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు


న్యూఢిల్లీ : ఆడిటర్‌ విజయసాయి రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రెండు రోజులుగా సాగుతున్న వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. దర్యాప్తునకు విజయసాయిరెడ్డి ఎక్కడా ఆటంకం కలిగించలేదని ఆయన తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. బెయిల్‌ పొందిన తర్వాత సీబీఐ మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 

ఇదే కేసులో నిందితులుగా ఉన్న హోంమంత్రి, ఐఏఎస్ అధికారులు బయటే ఉన్న విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ కేసులో ఎక్కువ ప్రభావితం చేసే వ్యక్తులు బయటే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే సీబీఐ విజయసాయిరెడ్డిని 300 గంటలు విచారించందని కోర్టుకు తెలిపారు. ఈ నెలలో విజయసాయిరెడ్డి కుమార్తె వివాహం ఉందని, దర్యాప్తునకు ఆయన అటంకం కలిగిస్తున్నారనడం అపోహేనని కోర్టుకు వివరించారు. 

0 comments:

Post a Comment