Tuesday 14 May 2013

స్థానిక ఎన్నికలకు సిద్ధం: కొణతాల రామకృష్ణ

విశాఖపట్నం: వైఎస్ జగన్ విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సోనియా అల్లుడుకి ఒక న్యాయమా.. వైఎస్‌ జగన్‌కు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌ కుంభకోణంలో సోనియా అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందని అన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. 

0 comments:

Post a Comment