Tuesday 14 May 2013

సీఎంపై సుప్రీంకోర్టుకెళ్తా: మాజీ మంత్రి పి.శంకర్రావు

హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారంలో సీఎం కిరణ్ హస్తం ఉందని, ఇది 2జీ స్పెక్ట్రం కన్నా పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్ర చందనం అక్రమ తరలింపునకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించినప్పటికీ, ఈ కేసులో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ సహా కళంకిత మంత్రులను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

0 comments:

Post a Comment