Saturday 18 May 2013

జగన్ సీఎం అవటం ఖాయం: గట్టు రామచంద్రారావు


తిరుమల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైఎస్ఆర్ ను గుండెల్లో దాచుకుందని ఆయన తెలిపారు. గట్టు రామచంద్రరావు శనివారం ఉదయం వెంకన్నను దర్శించుకున్నారు. 

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జగన్ జైలుకెళ్లాక కార్యకర్తలు కసిగా పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు.అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక వ్యక్తిపై కుట్రలు చేయటం దారుణమని గట్టు రామచంద్రరావు అన్నారు. జగన్ తరపున ప్రజలే ఉద్యమిస్తున్నారని, త్వరలోనే జగన్ ప్రజల్లోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment