Friday 31 May 2013

'తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తా':

కరీంనగర్ : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుంటానని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తనతో మాట్లాడారని ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వారు సూచించారని వివేక్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిసి స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఎంపీ రాజయ్యతో సహా అందరం టీఆర్ఎస్ లో చేరతామని మందా జగన్నాథం తెలిపారు.

0 comments:

Post a Comment