Tuesday 7 May 2013

అవినీతి మంత్రులను తొలగించని కేంద్రం:అంబటి రాంబాబు

గుంటూరు: అవినీతి మంత్రులను కేంద్రం తొలగించడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిఎంఓలో సీబీఐ నివేదికను ట్యాంపరింగ్ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మంట కలిసినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్గేట్ వ్యవహారంలో సాక్ష్యాలను తారుమారు చేసిన పెద్దమనుషులను వదిలేశారన్నారు. జగన్ బెయిల్ పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ అత్యాచారం చేసినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఎన్టీఆర్ ను చంపిన చంద్రబాబు, ఆయన విగ్రహాప్రతిష్టాపనకు వెళ్లడం సిగ్గుచేటుని పేర్కొన్నారు. సీబీఐను చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. సీబీఐ వ్యవహారం బయటకు వచ్చినా ఆయన నోరు ఎత్తకపోవడానికి కారణమేంటి? అని అడిగారు.

మంత్రి శైలజానాథ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ నేతలు కొణతాల రామకృష్ణ, కొండా సురేఖలపై ఎల్లోమీడియా విషప్రచారం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఎల్లోమీడియా యత్నాలు సఫలం కావన్నారు.

0 comments:

Post a Comment