Tuesday 7 May 2013

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ

బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. 93 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ 35, జేడీఎస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 36 కేంద్రాల్లో ఎన్నిక లెక్కింపు జరుగుతుండగా మొత్తం 223 స్థానాలకు గాను 2940 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారితో 58 మంది మహిళా అభ్యర్థులు కూడా వున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కాంగ్రెస్‌ ఆధిక్యత మొదలైంది. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

0 comments:

Post a Comment