Thursday 23 May 2013

చంద్రబాబుకు గద్దె పవర్ ఫుల్ డైలాగ్


ఒకపక్కన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంస్కరణల గురించి నల్లధనం గురించి మాట్లాడుతుంటే, ఆయన పార్టీకి చెందిన మాజీ ఎమ్.పి గద్దె రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు డబ్బున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని గద్దె వ్యక్తం చేయడం విశేషం.పైగా గద్దె పవర్ ఫుల్ డైలాగులు వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. రాజకీయాల్లో డబ్బు ప్రధానమని, అయితే డబ్బే రాజకీయం కాదని ఆయన ఘాటుగా మాట్లాడారు. టీడీపీ తరఫున ఎంపీ సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని రామ్మోహన్ ప్రకటించారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు డబ్బు ఖర్చుపెడితే.. ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చుపెడుతున్నవారి పరిస్థితి ఏంటని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు.ఎంపీ సీటు తన డిమాండ్ అని... అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు.కేశినేని ట్రావెల్స్ సంస్థ అధినేత కేశినేని నాని కి విజయవాడ టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారన్న సమాచారం గద్దెకు జీర్ణం కావడం లేదు.దాంతో ఆయన తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారు.

0 comments:

Post a Comment