Thursday 23 May 2013

YS జగన్‌ను టార్గెట్‌ చేస్తే కాంగ్రెస్‌కే నష్టం: శంకర్రావు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మీడియా సర్వేలే చెబుతున్నాయని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాలతో పార్టీ కేడర్ డీలా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకుని పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను అదేపనిగా టార్గెట్‌ చేయడం కాంగ్రెస్‌కే నష్టమని శంకర్రావు అన్నారు. 

0 comments:

Post a Comment