Thursday 23 May 2013

టీడీపీ లోకి మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసారు. గత కొంతకాలం గా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. మహబూబ్ నగర్ లో గతం లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిద్యం వహించారు . డీకే చేరిక తో టీడీపీ కి మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ పొటీ చేస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ సీనియర్ గ డీకే సేవలు పార్టీ కి ఉపయోగపడతాయని మహబూబ్ నగర్ నేతలు చెప్తున్నారు. అయితే డీకే కు గతం లో ఎవరితోనూ పడని చరిత్ర వుంది. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపి, టీఅరెస్ లోకి మారిన డీకే ఇప్పుడు టీడీపీ నిలదొక్కుకోగలరా అనేది ప్రశ్నార్ధకమేనని రాజకీయ విశ్లేషకుల వ్యాక్యానిస్తున్నారు .

0 comments:

Post a Comment