Wednesday 15 May 2013

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి లగడపాటి సన్నిహితుడు

నిన్న,మొన్నటివరకు విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సడన్ గా ఆయన పార్టీ మారారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. సమైక్యవాద ఉద్యమంలో లగడపాటితో సన్నిహితంగా ఉండడమే కాక, ఆయా విషయాలలో కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యంగానే ఉంటుంది.1083 లో టిడిపి పక్షాన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.నాదెండ్ల భాస్కరరావు అనుచరుడిగా టిడిపి లో సంక్షోభం ఏర్పడినప్పుడు నాదెండ్ల పక్షాన నిలిచారు.అప్పటి నుంచి రాజకీయంగా వెనుకబడ్డ అడుసుమిల్లి జయప్రకాష్ ఈ మద్య కాలంలో సమైక్యవాద ఉద్యమం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈయన పార్టీ మారడం ఆసక్తికరమై అంశమే. అడుసుమిల్లి జయప్రకాష్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. లగడపాటికి చెప్పకుండానే అడుసుమిల్లి పార్టీ మారి ఉంటారా!

0 comments:

Post a Comment