Wednesday 15 May 2013

YSజగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమన్నారు. అందుకోసం తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

0 comments:

Post a Comment