Wednesday 15 May 2013

తండ్రి రికార్డును అదిగమించిన YSషర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పాదయాత్రికురాలు షర్మిల పాదయాత్ర రెండువేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈమె కూడా తన తండ్రి రికార్డును అదిగమించారన్నమాట. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1476 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన కూడా మధ్యలో అస్వస్థతకు గురై దాదాపు వారం రోజులు ఇబ్బంది పడ్డారు. అలాగే షర్మిల కూడా తన మోకాలికి గాయం అవడంతో మధ్యలో నెల లోపు విరామం ఇచ్చారు.ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ సమీపంలోని వవస్థలిపురం వరకు పాదయాత్ర చేసిన ఆమె విరామం తర్వాత అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లావరకు పాదయాత్ర ద్వారా చేరుకున్నారు. చింతలపూడి నియోజకవర్గం రావికం పాడు వద్ద ఈనెల పదహారునాటికి రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తున్న సందర్భంగా పార్టీ ముఖ్యనేతలంతా అక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది.ఒక మహిళ రెండువేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం ఒక రికార్డేనని చెప్పాలి. రాష్ట్ర చరిత్రలో ఒక మహిళా నేత ఇలా చేసిన సందర్భమే లేదు. ఆ క్రెడిట్ షర్మిలకు దక్కింది.

0 comments:

Post a Comment